Tnrnews.in
ఆంధ్రప్రదేశ్

లక్ష తెల్లజిల్లేడు పువ్వులతో ఉచ్ఛిష్ట గణపతికి చతుర్థి నీరాజనం

  • స్వయంభూ కాకినాడ భోగిగణపతి పీఠంలో ‘232’వ సంకష్టహారచతుర్థి ఉత్సవం

కాకినాడ : కాకినాడ స్వయంభూ భోగిగణపతి పీఠంలో 232వ సంకష్టహారచతుర్థి సందర్భంగా ఉచ్చిష్ట గణపతికి లక్ష తెల్ల జిల్లేడు పువ్వులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 60మంది చైత్రమాస చతుర్థి ఉపవాసకులతో సుప్రభాతవేళ  పీఠం మాఢ వీధుల్లో మంగళ వాయిద్యాల నడుమ నగర సంకీర్తన జరిగింది. తెల్ల జిల్లేడు పుష్పాల పాలవెల్లితో, సహస్ర నామ పారాయణ, లక్ష వత్తులతో దీపారాధన, పంచామృతాలతో అభిషేకం, చంద్రునికి అర్ఘ్యం సమర్పించి ఉపవాసకులకు పసుపు, కుంకుమ, గాజులు, రవిక తాంబూలాలతో అల్పాహారం అందించారు. పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ తెల్ల జిల్లేడు పుష్పాలతో క్రిష్ణపక్ష చతుర్థి వేళ గణేశునికి అర్చన చేయడం వలన కడిగినముత్యం వలె ప్రారబ్ధ కర్మలు పరిహారమవుతాయన్నారు. కాలజ్ఞాన స్వరూపంగా భోగియజ్ఞంలో నిలిపిన శతాధిక వత్సరాల రావి మాను దుంగ నుండి స్వయంభువుగా అగ్నిహోత్రంలో వెలిసిన విఘ్నేశ్వర స్వరూపాన్ని పరిరక్షించేందుకు పంచ లోహాల తాపడంతో కాంస్య కవచ యజ్ఞం జరిగిన సందర్బంగా గత ఏడాది నుండి ఉపవాసకులతో ప్రత్యేకంగా జరుగుతున్న సామూహిక చతుర్థిమాసోత్సవాలు విశ్వావసు నామ సంవత్సర మాఘ చతుర్థివరకు జరుగుతాయన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో ఘనంగా పంద్రాగస్టు వేడుకలు

Dr Suneelkumar Yandra

శ్రీ దుర్గ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ప్రారంభించిన మర్రెడ్డి

Dr Suneelkumar Yandra

ట్రూడౌన్ గా విద్యుత్ సర్దుబాటు చార్జీలు రద్దు చేయాలి

Dr Suneelkumar Yandra

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రైల్వే శాఖలో 9970 పోస్టులు

TNR NEWS

గౌరీ నాయుడుకి యువ సాహితీ పురస్కారం

Dr Suneelkumar Yandra

జర్నలిస్ట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ

Dr Suneelkumar Yandra