Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

కాకినాడ ఈద్గా మైదానం కోర్టుకేసులు పరిష్కరించాలి.. అభివృద్ధి చేయాలి – ముఖ్యమంత్రి, డిప్యూటీ సిఎం, మైనారిటీ, ఐటి, జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రులకు పౌర సంక్షేమ సంఘం లేఖ

కాకినాడ : కాకినాడ పిఠాపురం రోడ్ రహదారిలో 50 ఏళ్ల క్రిందట జె.ఎన్.టి.యు వద్ద ఏర్పడిన ఈద్గా మైదానం పరిధికి చెందిన కోర్టు కేసులు పరిష్కరించే దిశగా ప్రభుత్వం చొరవ చూపాలని పౌర సంక్షేమ సంఘం కోరింది. ప్రతి ఏటా రంజాన్ సందర్భంగా జిల్లా కేంద్రంలో నగర ముస్లింలు సామూహికంగా ప్రార్థనలు చేసుకునే ప్రత్యేక వెసులుబాటు వలన ఇక్కడి ఈద్గా మైదానానికి ఆధ్యాత్మిక గుర్తింపు విశేష చరిత్ర ఏర్పడిందన్నారు. ఈద్గా మైదాన పరిధి విషయంలో వ్యాజ్యం పరిష్కారం చేయని కారణంగా అభివృద్ధి జరగడం లేదన్నారు. ప్రభుత్వం చట్టబద్ధమైన అధికారం కల్పించి ఈద్గా మైదానం ప్రగతికి పరిష్కారం చూపాలని పౌర సంఘం కన్వీనర్ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు కోరారు. ఈమేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సిఎం కొణిదెలపవన్ కళ్యాణ్, లా అండ్ జస్టిస్ మైనారిటీ శాఖా మంత్రి నస్యం మహ్మద్ ఫరూక్, జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి పొంగూరు నారాయణ, విద్య, ఐటి శాఖామంత్రి లోకేష్ లకు పంపిన వినతి పత్రాల్లో తెలియజేసారు.

Related posts

పిల్లలకు మంచిమాటలు చెప్పేందుకే ఒప్పుకున్నా: చాగంటి

TNR NEWS

కాకినాడ కార్పోరేషన్ ‘ట్రేడ్’ రాబడిపై నిఘా నిర్వహించాలి – పౌర సంక్షేమ సంఘం డిమాండ్

Reporter James Chinna

అధికారులకుడిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వార్నింగ్

TNR NEWS

పైసల్ కే సలాం  జెండా మోసిన వారికి అన్యాయం..!!

TNR NEWS

పాన్‌కార్డుకు ఆధార్ లింక్ చేయకపోతే ఏమవుతుందో తెలుసా..?

TNR NEWS

పిర్ల సూర్యనారాయణ మరణం నెల్లిపూడి గ్రామానికి తీరనిలోటు – జనసేన జిల్లా కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు