ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ కోదాడ నూతన కార్యవర్గాన్ని బార్ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ నూతన కార్యవర్గం ఎన్నిక అసోసియేషన్, సెక్రటరీ చింతకుంట్ల రామిరెడ్డి, ఐ ఏ ఎల్ జిల్లా ఉపాధ్యక్షులు గట్ల నరసింహారావు, సీనియర్ ఐఏఎల్ న్యాయవాది కాకర్ల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా షేక్ అబ్దుల్ రహీం,ఉపాధ్యక్షులుగా కోడూరు వెంకటేశ్వరరావు,ప్రధాన కార్యదర్శిగా ఎస్ వి చలం,జాయింట్ సెక్రటరీగా ఆవుల మల్లికార్జున్,కోశాధికారిగా చేన్న పెద్దబ్బాయి,మహిళా ప్రతినిధిగా వి రాంబాయి తో పాటు సభ్యులుగా నవీన్ కుమార్ సుల్తాన్ నాగరాజు తదితరులు ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గం న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు న్యాయం కోసం వచ్చే పేదలకు ఉచితంగా న్యాయ సేవలు అందించాలని కోరారు.అదేవిధంగా ఈనెల 30న హనుమకొండలో జరిగే ఐ ఏ ఎల్ రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో దొడ్డ శ్రీధర్, కానుగ మురళి,నవీన్, బాల నరసయ్య తదితరులు పాల్గొన్నారు……….
Save or share this story as a newspaper-style Epaper Clip:
