Tnrnews.in
తెలంగాణ

అకాల వర్షాల దృష్ట్యా రానున్న 3 రోజులు రైతులు అప్రమత్తంగా ఉండాలి…. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

మూడు రోజుల పాటు అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

 

వాతావరణ శాఖ అందించే సమాచారం ప్రకారం మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని, కొనుగోలు కేంద్రాల వద్ద, కల్లాల వద్ద ధాన్యం ఆరబెట్టుకున్న రైతులు అప్రమత్తంగా ఉండాలని, కొనుగోలు కేంద్రాలలో అవసరమైన మేర టార్ఫాలిన్ కవర్లు అందుబాటులో ఉన్నాయని, ధాన్యం తడవకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

 

కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు సంబంధిత రైస్ మిల్లులకు తరలించాలని, ఎక్కడ వాహనాల కోరత ఉండవద్దని కలెక్టర్ అధికారులకు సూచించారు. అకాల వర్షాల కారణంగా రైతులు నష్టపోకుండా అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ప్రజా సమస్యల పరిష్కారమే సిపిఐ ఎజెండా  సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు

TNR NEWS

విలువలతో కూడిన విద్యను అందించాలి

Harish Hs

సావిత్రీబాయి ఫూలే సేవలు మరువలేనివి

TNR NEWS

కోదాడను కమ్మేసిన మంచు దుప్పటి

Harish Hs

అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు

Harish Hs

తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన మాజీ ఎమ్మెల్యే దాసరి

TNR NEWS