May 11, 2026
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

సంక్షోభంలో ఉన్న రవాణా రంగాన్ని ఆదుకోవాలి…..  రవాణా రంగ సమస్యలపై పార్లమెంటులో చర్చించాలి….  మాజీ సీఎం, ప్రస్తుత ఎంపీ బిప్లబ్ కుమార్ దేవ్ కు వినతి పత్రం అందజేత..  తెలంగాణ రాష్ట్ర లారీ అసోసియేషన్ చైర్మన్ రామినేని శ్రీనివాసరావు

దేశవ్యాప్తంగా రవాణా రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని తెలంగాణ రాష్ట్ర లారీ అసోసియేషన్ చైర్మన్ రామినేని శ్రీనివాసరావు కోదాడకు వచ్చిన త్రిపుర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఎంపీ బిప్లబ్ కుమార్ దేవ్ కు వినతిపత్రం అందించి సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లారు. ప్రధానంగా పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరలు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు, టోల్గేట్ ధరలతో రవాణా రంగం సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. 15 సంవత్సరాల కలపరిమితి తర్వాత వాహనాలను రద్దు చేయడంతో చిన్న, చిన్న యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పెట్రోల్,డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని అన్ని సమస్యలపై పార్లమెంటులో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరించాలని కోరారు. అనంతరం కోదాడకు వచ్చిన సందర్భంగా వారిని శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో వారి వెంట డాక్టర్ బ్రహ్మం, కాటంరెడ్డి ప్రసాద్ రెడ్డి, పత్తిపాక జనార్దన్ తదితరులు పాల్గొన్నారు……..

Related posts

గుడ్ న్యూస్..త్వరలో పంచాయతీలకు పెండింగ్ బిల్లులు..!!

TNR NEWS

TNR NEWS

ప్రవీణ్ పగడాల మృతిపై సమగ్ర విచారణ జరపాలి

TNR NEWS

సన్న బియ్యం పథకం దేశానికే ఆదర్శం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి చిత్రపటాలకు పాలాభిషేకం.

TNR NEWS

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతి

Harish Hs

ముఖ్యమంత్రిని కలిసిన మాల మహానాడు అనుమకొండ జిల్లా అధ్యక్షులు  ముప్పిడి శ్రవణ్ కుమార్

TNR NEWS