Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

సంక్షోభంలో ఉన్న రవాణా రంగాన్ని ఆదుకోవాలి…..  రవాణా రంగ సమస్యలపై పార్లమెంటులో చర్చించాలి….  మాజీ సీఎం, ప్రస్తుత ఎంపీ బిప్లబ్ కుమార్ దేవ్ కు వినతి పత్రం అందజేత..  తెలంగాణ రాష్ట్ర లారీ అసోసియేషన్ చైర్మన్ రామినేని శ్రీనివాసరావు

దేశవ్యాప్తంగా రవాణా రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని తెలంగాణ రాష్ట్ర లారీ అసోసియేషన్ చైర్మన్ రామినేని శ్రీనివాసరావు కోదాడకు వచ్చిన త్రిపుర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఎంపీ బిప్లబ్ కుమార్ దేవ్ కు వినతిపత్రం అందించి సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లారు. ప్రధానంగా పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరలు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు, టోల్గేట్ ధరలతో రవాణా రంగం సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. 15 సంవత్సరాల కలపరిమితి తర్వాత వాహనాలను రద్దు చేయడంతో చిన్న, చిన్న యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పెట్రోల్,డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని అన్ని సమస్యలపై పార్లమెంటులో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరించాలని కోరారు. అనంతరం కోదాడకు వచ్చిన సందర్భంగా వారిని శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో వారి వెంట డాక్టర్ బ్రహ్మం, కాటంరెడ్డి ప్రసాద్ రెడ్డి, పత్తిపాక జనార్దన్ తదితరులు పాల్గొన్నారు……..

Related posts

అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాలి మండల బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి… కోల ఆంజనే యులు.  

TNR NEWS

కనుల పండువగా అభయాంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలు

TNR NEWS

రైతులను ఇబ్బంది పెట్టే మిల్లర్లపై చర్యలు తప్పవు  వారం రోజుల్లో జిల్లాలోని దాన్యం కొనుగోలు కేంద్రాలు, మిల్లులలో ఉన్న ధాన్యం అంతటిని ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది:మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

TNR NEWS

సెయింట్ థెరీసా స్కూల్లో ఘనంగా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు బడుగు బలహీన విద్యార్థులకు విద్యను అందిస్తున్న మిషనరీ సంస్థ పాల్గొన్న పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి 

TNR NEWS

సైకాలజిస్ట్ ల సంఘం జిల్లా అధ్యక్షునిగా రాజశేఖర్

Harish Hs

రోడ్లపై జరిగే వాహనాల ప్రమాదాలపై ప్రతి ఒక్కరు జాగ్రత్త వహించాలి

Harish Hs