May 19, 2026
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

నేపాల్ రాయబారిని కలిసి చర్చలు చేసిన ఎం.డి. నాయుడు  – స్ట్రీ శక్తి ప్రతిభా అవార్డ్స్‌లో నేపాల్ పాల్గొనడం ఖాయం; పర్యాటక సహకారంపై కూడా చర్చలు

ఢిల్లీ, డిసెంబర్ 05 : స్ట్రీ శక్తి ప్రతిభా అవార్డ్స్ వ్యవస్థాపకుడు మరియు విజనరీ ఎం.డి. నాయుడు శుక్రవారం న్యూ ఢిల్లీలోని నేపాల్ రాయబార కార్యాలయంలో నేపాల్ రాయబారి మహామహోపాధ్యాయ డాక్టర్ శంకర్ ప్రసాద్ శర్మని మర్యాదపూర్వకంగా సందర్శించారు. సుమారు 20 నిమిషాలపాటు జరిగిన ఈ సమావేశంలో రాబోయే స్ట్రీ శక్తి ప్రతిభా అవార్డ్స్ 2025 కోసం నేపాల్ నుండి అధికారిక ప్రతినిధులను ఆహ్వానించారు. దీనికి స్పందించిన రాయబారి నేపాల్ నుండి ఖచ్చితంగా ప్రతినిధులు పాల్గొంటారు అని హామీ ఇచ్చారు. దీంతో ఈ అవార్డ్స్ అంతర్జాతీయ స్థాయిలో మరో అడుగు ముందుకేసినట్లైంది.

 

– భారత–నేపాల్ పర్యాటక సహకారంపై ముఖ్యమైన చర్చలు

 

ఈ సమావేశంలో రెండు దేశాల మధ్య పర్యాటక మరియు సాంస్కృతిక సహకారం గురించి కూడా విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా… భారత్–నేపాల్ ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక పర్యాటకంను కలిసి ప్రోత్సహించడం. రెండు దేశాల సామాన్య వారసత్వాన్ని ప్రతిబింబించే కలయిక పర్యాటక ప్రచారాలు, మహిళా పారిశ్రామికవేత్తలకు పర్యాటక రంగంలో అవకాశాల సృష్టి, ప్రజల మధ్య సాంస్కృతిక అవగాహన పెంచే పరిశీలనాత్మక మార్పిడి కార్యక్రమాలు, ఈ చర్చలు రెండు దేశాల మధ్య పర్యాటక, సాంస్కృతిక, ఆర్థిక సహకారం మరింత బలపడే దిశగా పునాది వేస్తాయి.

 

– భవిష్యత్‌లో సంయుక్త కార్యక్రమాలు

 

సమావేశంలో మరో ముఖ్యాంశాలు:

 

మహిళా నాయకత్వం & నైపుణ్యాభివృద్ధి, యువత శక్తివంతం కార్యక్రమాలు, నేపాల్ నుండి చేంజ్‌మేకర్స్‌కు గుర్తింపు, విద్య, కళ, సంస్కృతి రంగాల్లో విజ్ఞాన మార్పిడి. సమావేశం అనంతరం ఎం.డి. నాయుడు మాట్లాడుతూ

“డాక్టర్ శంకర్ ప్రసాద్ శర్మని కలవడం తమ అదృష్టం అన్నారు. స్ట్రీ శక్తి అవార్డ్స్‌లో నేపాల్ పాల్గొనడంతో ఈ వేదిక అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తుందని, పర్యాటక రంగంలో కలిసి పనిచేయడం రెండు దేశాలకు కొత్త అవకాశాలు సృష్టిస్తుంది” అని అన్నారు. స్ట్రీ శక్తి ప్రతిభా అవార్డ్స్ 2025 కార్యక్రమం డిసెంబర్ 22–23, 2025 తేదీల్లో మల్లా రెడ్డి యూనివర్శిటీ, హైదరాబాద్లో జరుగనుంది. ఈ సమావేశం భారత–నేపాల్ మధ్య మహిళా శక్తివృద్ధి, సాంస్కృతిక ఐక్యత, పర్యాటక భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేసే కీలక అడుగుగా నిలిచింది.

Related posts

స్త్రీ ఆర్ధిక సాధికారతతోనే కుటుంబం అభివృద్ధి : పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా

TNR NEWS

పిఠాపురంలో చేయూత నిత్యాన్నదానం ప్రారంభం

Dr Suneelkumar Yandra

కమ్మేసిన మంచు దుప్పటి

Harish Hs

ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ కార్యవర్గాలు ఏర్పాటు చేసిన న్యాయవాది గౌరీమణి

Dr Suneelkumar Yandra

తిరుమల పవిత్రత పరిరక్షనే ధ్యేయంగా రాజకీయాలకు అతీతంగా అడుగులు వేస్తున్న బీసీవై పార్టీ అధినేత

TNR NEWS

‘వనజీవి’ రామయ్య స్ఫూర్తిని కొనసాగిస్తాము – ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Dr Suneelkumar Yandra