February 4, 2025
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం కోదాడ ఎస్టీయూ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 2025 నూతన సంవత్సర క్యాలెండరు, డైరీ ని ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి, రాష్ట్ర టూరిజం చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డితో కలిసి ఆవిష్కరించి ఆయన మాట్లాడారు ఉపాధ్యాయుల సమస్యలు అన్నిటినీ పరిష్కరించేందుకు ప్రభుత్వం సుమఖంగా ఉందన్నారు. ఉపాధ్యాయుల తోనే సమాజ చైతన్యం కలుగుతుందని ఉపాధ్యాయులకు తప్పకుండా ప్రభుత్వం అన్ని రకాలుగా సముచిత స్థానం ఇస్తుందన్నారు. ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు అందరూ కృషి చేయాలని కోరారు. ఉపాధ్యాయులకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ సలీం షరీఫ్, ఎస్ టి యు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఓరుగంటి నాగేశ్వరరావు, బంధం వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకులు సత్యనారాయణ, రామిశెట్టి శ్రీనివాసరావు, వెంకటరమణ రూప్లా నాయక్, సత్తూరి బిక్షం, బూర వెంకటేశ్వర్లు, ఓరుగంటి నాగేశ్వరరావు, భాస్కర్ రావు, చందూలాల్ తదితరులు పాల్గొన్నారు……

Related posts

ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి లో కొత్త రికార్డు సృష్టించిందని జుక్కల్ ఎమ్మెల్యే తోట

TNR NEWS

విగ్నేశ్వర మహిళా సంఘం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు ప్రారంభం

TNR NEWS

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

TNR NEWS

అకాల వర్షాల దృష్ట్యా రానున్న 3 రోజులు రైతులు అప్రమత్తంగా ఉండాలి…. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

TNR NEWS

లక్షడప్పులు వేయిగొంతులు ప్రచార రథయాత్ర కు హాజరైన ప్రజా యుద్ధనౌక డాక్టర్ ఏపూరి సోమన్న

Harish Hs

నల్లగొండ ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా

TNR NEWS