Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో సినిమా ట్రైలర్ ఆవిష్కరణ

అసెంబ్లీ ప్రాంగణంలో సలాం సైనికా సినిమా ట్రైలర్ ఆవిష్కరణ జరిగింది. ఈ ట్రైలర్‌ను స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆవిష్కరించారు. ఫిబ్రవరి 14న సలాం సైనికా చిత్రం విడుదల కానుంది. సైనికులకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదని తన భావన అని.. ఈ సినిమాలో 200 మంది కొత్త నటులు నటించారని, సినిమా అంతా ఏపీలోనే నిర్మించారన్నారు. సమాజానికి సందేశం ఇచ్చే సినిమాలకు తమ ప్రోత్సహం ఉంటుందని అయ్యన్న పాత్రుడు అన్నారు. త్రివర్ణ పతాకాన్ని శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుల, మత ప్రాంతాలకు అతీతంగా స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారని, ఇంకా అసమానతలు కొనసాగుతున్నాయని, కుల, మతాలు, ప్రాంతాల మధ్య విబేధాలు సృష్టిస్తున్నారన్నారు. పేదవాడికి ఓ చదువు, లేనివాడికి ఓ చదువు అందుతుందని, చదువు ద్వారానే అభివృద్ధి సాధ్యమని అందరూ గ్రహించాలన్నారు. ప్రజలు తమ హక్కులు గురించి తెలుసుకోవాలని, పాఠ్యాంశాల్లో రాజ్యాంగ విలువల్ని పొందుపరచాలని మోషేన్ రాజు అన్నారు.

Related posts

స్మార్ట్ సిటీ సమ్మర్ స్టోరేజ్ అవసరాలు తీర్చాలి – పౌరసంక్షేమసంఘం డిమాండ్

Dr Suneelkumar Yandra

గొల్లప్రోలులో అడ్డగోలుగా అక్రమ లేఅవుట్లు – చోద్యం చూస్తున్న అధికారులు

రూ. 20,000/- లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై గుణశేఖర్

Dr Suneelkumar Yandra

తీర్చలేని ఋణం

TNR NEWS

ధాన్యం కొనుగోళ్లలో చారిత్రాత్మక మైలురాయి చేరాం

Dr Suneelkumar Yandra

పిఠా‘‘పుర’’ంలో ఎన్నికల కోడ్‌ వర్తించదా…!? – చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులు

Dr Suneelkumar Yandra