పిఠాపురం : పిఠాపురం మండలం, దొంతమూరు గ్రామానికి చెందిన కిల్లాడి దుర్గాప్రసాద్, సానబోయిన గంగరాజు అనువారు నుండి రూ. 20,000 లంచం తీసుకుంటూ రూరల్ ఎస్సై ఎల్.గుణశేఖర్ మరియు అతని వ్యక్తిగత డ్రైవర్ శివ ఎసిబి అధికారులకు చిక్కిన వైనం అవినీతి నిరోధక శాఖ డి.ఎస్.పి కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో ఎసిబి సిబ్బంది పక్కా సమాచారంతో దాడి చేయగా లంచం తీసుకుంటూ రూరల్ ఎస్సై గుణశేఖర్ అధికారులకు పట్టుబడ్డారు. జరిగిన సంఘటనపై కాకినాడ అడిషనల్ ఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ పిఠాపురం స్టేషన్ కి చేరుకుని శాఖపరమైన విచారణ చేపట్టారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:
