Tnrnews.in
తెలంగాణ

క్రీడలు స్నేహ భావాన్ని పెంపొందిస్తాయి

కోదాడ పట్టణంలో రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు అన్నారు. ఆదివారం పట్టణంలోని కటకమ్మ గూడెం రోడ్డులో గల గ్రౌండ్లో కోదాడ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలను పిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి తో కలిసి వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకొని మాట్లాడారు.నేటి యువత చదువుతోపాటు క్రీడా స్ఫూర్తిని అలవర్చుకొని క్రీడల్లో రాణించాలన్నారు. క్రీడాకారులకు క్రీడల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు, మొదటి బహుమతి దాత రాజేష్, బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు షేక్ నయీమ్, కర్ల సుందర్ బాబు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక అధ్యక్షులు పంది తిరపయ్య, షేక్ మస్తాన్ నిర్వాహకులు లాజర్,భరత్, కోటేష్, సతీష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

పొగ మంచు కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులు

Harish Hs

కోదాడ లో కిడ్నీ రాకెట్ ముఠా అరెస్ట్

Harish Hs

350,999కు ఫ్యాన్సీ నెంబర్ దక్కించుకున్న రామినేని శ్రీనివాసరావు

TNR NEWS

ఇళ్ల స్థలాలు లేని పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి

Harish Hs

పెద్ద అంబర్‌పేటలో నకిలీ డీఏపీ తయారీ ముఠా గుట్టురట్టు.! సీఐ చరమంద రాజు చాకచక్యంతో వెలుగులోకి వచ్చిన నకిలీ ఎరువుల దందా..! రూ. ఒక కోటి 50 లక్షల విలువైన వెయ్యి బస్తాలు స్వాధీనం…. ! పరారీలో నిందితులు….!

TNR NEWS

మెగా జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలి :కరపత్రాలు పంచుతున్న కాంగ్రెస్ నాయకులు

TNR NEWS