Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

పంచాయతీ కార్మికులకు రూ.21వేల కనీస వేతనం ఇవ్వాలి

కాకినాడ : నగరంలోని మున్సిపల్ కార్మికు ల తరహాలో పంచాయతీ కార్మికులకు నెలవారీ వేతనాలు రూ.21వేలు ఇవ్వాలని పౌర సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. నెలకు రూ.7వేల నుండి రూ.9వేల వేతనాలు ఇవ్వడం వలన వారి కుటుంబాలకు కడుపు నింపుకునే అవకాశం కలగడం లేదన్నారు. 551/132/57/142/680 జిఒల ప్రకారం పిఎఫ్, ఇఎస్ఐ ప్రమాద భీమా  అమలు చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4నెలల నుండి 45నెలల మేరకు పంచాయతీల్లో కార్మిక వేతనాలు పెండింగ్ ఏర్పడటం దురదృష్ట కరమన్నారు. పంచాయితీల్లో పని చేసే ఎన్ఎంఆర్ లకు ప్రభుత్వ జీతాలు చెల్లించే ప్రణాళిక రావాలన్నారు. నగరాన్ని ఆనుకుని వున్న గ్రామ పంచాయతీలను పరిశుభ్రంగా ఉంచుతు న్న కార్మికులకు కనీస వేతనాలు లేకపోవడం తగదన్నారు. నగరాల్లో విలీన గ్రామాల వ్యాజ్యా న్ని పరిష్కరించక పోవడం వలన పంచాయతీ కార్మికుల సమస్యలు తీవ్రతరంగా వున్నాయన్నారు.

Related posts

సీఎం చంద్రబాబును మరిచిపోయిన అధికారులు.. సొంత ఇలాఖాలోనే ఇలానా?

TNR NEWS

గర్భాశయ సమస్యతో బాదపడుతున్న మహిళకి ఆర్థిక సహాయం

Dr Suneelkumar Yandra

వరద బాధితులను ఆదుకునేందుకు విశాఖ జిల్లా పార్టీ కార్యాలయంలో

TNR NEWS

పిర్ల సూర్యనారాయణ మరణం నెల్లిపూడి గ్రామానికి తీరనిలోటు – జనసేన జిల్లా కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు

కాకినాడ కార్పోరేషన్ త్రాగునీటి సరఫరాకు చేరుతున్న గోదావరి జలాలు కలుషితం అవుతున్నాయి

Dr Suneelkumar Yandra

ఏపీలో వాహనదారులకు పోలీసుశాఖ షాక్ – రేపటి నుంచి భారీ జరిమానాలు