November 17, 2025
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

పంచాయతీ కార్మికులకు రూ.21వేల కనీస వేతనం ఇవ్వాలి

కాకినాడ : నగరంలోని మున్సిపల్ కార్మికు ల తరహాలో పంచాయతీ కార్మికులకు నెలవారీ వేతనాలు రూ.21వేలు ఇవ్వాలని పౌర సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. నెలకు రూ.7వేల నుండి రూ.9వేల వేతనాలు ఇవ్వడం వలన వారి కుటుంబాలకు కడుపు నింపుకునే అవకాశం కలగడం లేదన్నారు. 551/132/57/142/680 జిఒల ప్రకారం పిఎఫ్, ఇఎస్ఐ ప్రమాద భీమా  అమలు చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4నెలల నుండి 45నెలల మేరకు పంచాయతీల్లో కార్మిక వేతనాలు పెండింగ్ ఏర్పడటం దురదృష్ట కరమన్నారు. పంచాయితీల్లో పని చేసే ఎన్ఎంఆర్ లకు ప్రభుత్వ జీతాలు చెల్లించే ప్రణాళిక రావాలన్నారు. నగరాన్ని ఆనుకుని వున్న గ్రామ పంచాయతీలను పరిశుభ్రంగా ఉంచుతు న్న కార్మికులకు కనీస వేతనాలు లేకపోవడం తగదన్నారు. నగరాల్లో విలీన గ్రామాల వ్యాజ్యా న్ని పరిష్కరించక పోవడం వలన పంచాయతీ కార్మికుల సమస్యలు తీవ్రతరంగా వున్నాయన్నారు.

Related posts

వయోజన విద్యా సెంటర్స్ ప్రారంభోత్సవం

అడవులను కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైంది

Dr Suneelkumar Yandra

ఆర్టీసి రిటైర్డు ఉద్యోగులకు వృద్ధాప్య ఫించన్ కల్పించాలి పౌరసంక్షేమ సంఘం

Dr Suneelkumar Yandra

జనసేన ఆవిర్భావ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం

Dr Suneelkumar Yandra

సీఎం చంద్రబాబును కలిసిన ఎన్ఆర్ఐ విద్యార్థి సిద్ధార్థ్

Dr Suneelkumar Yandra

లలిత కళ పరిషత్‌ ఆధ్వర్యంలో ఘనంగా కవిశేఖర డాక్టర్‌ ఉమర్‌ ఆలీషా 140వజయంతి ఉత్సవాలు