Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

బాపూజీ గ్రంథాలయం ఎదుట బీఈడీ అభ్యర్థుల నిరసన

ఉపాధ్యాయ ఖాళీల భర్తీలో స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని బిఈడి అభ్యర్థుల నియోజకవర్గ అధ్యక్షుడు శివాజీ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. కోదాడ పట్టణ పరిధిలోని బాపూజి శాఖ గ్రంధాలయం ఎదుట బుధవారం పదోన్నతుల ప్రక్రియకు వ్యతిరేకంగా అభ్యర్థులు నిరసనకు దిగారు. సీనియర్ ఎస్జీటీ టీచర్లకు 70శాతం మేరా పదోన్నతులు కల్పించడంతో బీఈడి అభ్యర్థులకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. టీచర్ పోస్టుల ఖాళీలాల్లో 30 శాతం మాత్రమే నేరుగా భర్తీ చేస్తూ, 70 శాతం ఖాళీలు పదోన్నతులు కల్పిస్తుండం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ రాష్ట్రంతో సహా ఇతర రాష్ట్రాల మాదిరిగా 70 శాతం స్కూల్ అసిస్టెంట్ పోస్టులను బీఈడీ అభ్యర్ధులతోనే నింపుతున్నట్లుగా మన రాష్ట్రంలో కూడా అమలు చేయాలని కోరారు. పదోన్నతుల అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుని బీఈడీ అభ్యర్థులకు న్యాయం చేయాలన్నారు. రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆందోళనకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. బీఈడీ అభ్యర్థులు రాంబాబు, శ్రీను, సందీప్, నరేష్, శోభ, సారిక, సుమ, తులసి, రమేష్ శ్రీరాములు, శ్రీకాంత్, రామారావు, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

Harish Hs

పేదల డబ్బా కోట్లకు నోటీసులు ఇవ్వడం అన్యాయం……

Harish Hs

గ్రామ దేవతలను ఆరాధించడం తెలంగాణ సంస్కృతిలో భాగం

Harish Hs

కందుల కొనుగోలు కేంద్రంను ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా వ్యవసాయానికి కేసీఆర్ చేసినంత సేవ దేశ చరిత్రలో ఎవరూ చేయలేదు రైతన్నల హామీలు ఇవ్వకపోతే అన్నదాతలతో కలిసి కొట్లాడుతాం అవినీతి రహితంగా కొనుగోలు కేంద్రాన్ని చేపట్టాలి జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి

TNR NEWS

*మోకుదెబ్బ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పల్నాటి నర్సింహా గౌడ్ ను తొలగింపు* 

TNR NEWS

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పేరుతో తీసిన గుంతలను వెంటనే పూడ్చాలి. కొత్త రోడ్లు వేయాలి.  సిపిఎం వన్ టౌన్ కార్యదర్శి వల్లపు దాసు సాయికుమార్

TNR NEWS