Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
అంతర్జాతీయం

బాపూజీ గ్రంథాలయం ఎదుట బీఈడీ అభ్యర్థుల నిరసన

ఉపాధ్యాయ ఖాళీల భర్తీలో స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని బిఈడి అభ్యర్థుల నియోజకవర్గ అధ్యక్షుడు శివాజీ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. కోదాడ పట్టణ పరిధిలోని బాపూజి శాఖ గ్రంధాలయం ఎదుట బుధవారం పదోన్నతుల ప్రక్రియకు వ్యతిరేకంగా అభ్యర్థులు నిరసనకు దిగారు. సీనియర్ ఎస్జీటీ టీచర్లకు 70శాతం మేరా పదోన్నతులు కల్పించడంతో బీఈడి అభ్యర్థులకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. టీచర్ పోస్టుల ఖాళీలాల్లో 30 శాతం మాత్రమే నేరుగా భర్తీ చేస్తూ, 70 శాతం ఖాళీలు పదోన్నతులు కల్పిస్తుండం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ రాష్ట్రంతో సహా ఇతర రాష్ట్రాల మాదిరిగా 70 శాతం స్కూల్ అసిస్టెంట్ పోస్టులను బీఈడీ అభ్యర్ధులతోనే నింపుతున్నట్లుగా మన రాష్ట్రంలో కూడా అమలు చేయాలని కోరారు. పదోన్నతుల అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుని బీఈడీ అభ్యర్థులకు న్యాయం చేయాలన్నారు. రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆందోళనకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. బీఈడీ అభ్యర్థులు రాంబాబు, శ్రీను, సందీప్, నరేష్, శోభ, సారిక, సుమ, తులసి, రమేష్ శ్రీరాములు, శ్రీకాంత్, రామారావు, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

అధికారికంగా బాధ్యతలు స్వీకరించిన గోదావరి ఈస్టర్న్ డెల్టా ప్రాజెక్ట్ చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్

Dr Suneelkumar Yandra

అన్నవరం అన్నప్రసాద నిర్వహణలో బఫే అభినందనీయం – స్వయంభూ భోగిగణపతి పీఠం

Dr Suneelkumar Yandra

టోక్యో (జపాన్)లో . పర్యటించిన స్పీకర్ ప్రసాద్ కుమార్.

TNR NEWS

జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం

Harish Hs

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రైల్వే శాఖలో 9970 పోస్టులు

TNR NEWS

పది జిల్లా టాపర్ తాళ్లూరి రేఖశ్రీకు ఆస్క్ ఆధ్వర్యంలో ఘన సన్మానం

Harish Hs