Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

సుప్రీంకోర్టు స్టేను స్వాగతిస్తున్నాం…. హెచ్‌సీయు భూములను కార్పొరేట్‌ శక్తులకు అప్పగించొద్దు….  సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి 

సూర్యాపేట:హైదరాబాదు సెంట్రల్‌ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం వేలం వేసి కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెట్టాలనే ప్రయత్నంలో భాగంగా బుల్డోజర్లతో అక్కడి చెట్లను తొలగించి, భూమిని చదును చేసి, జంతువులకు తీవ్ర ఇబ్బంది కల్గించే చర్యలకు పాల్పడుతున్నది. దీన్ని వ్యతిరేకించిన విద్యార్థులపై లాఠీఛార్జీ, అరెస్టులు, అక్రమ కేసులు పెట్టి, జైలుకు పంపింది. ఈ నేపథ్యంలో ఇట్టి భూమిలో చెట్ల తొలగింపు, చదును చేయడం వెంటనే నిలిపివేయాలని సుప్రీంకోర్టు స్టే విధించడాన్ని సిపిఎం పార్టీ స్వాగతిస్తుందని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి గురువారం ఒక ప్రకటన అన్నారు. ఈ స్టేను దృష్టిలో పెట్టుకుని ఈ భూములను వేలం వేసే ప్రక్రియను ఉపసంహరించుకోవాలని, విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. ఇలాంటి చర్యలకు పూనుకుంటే భవిష్యత్‌లో రాష్ట్ర ప్రభుత్వంపై విద్యార్థులు, మేధావులు, ప్రజా సంఘాలు, ప్రజలు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారని హెచ్చరించారు.

Related posts

సుధా బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలి

Harish Hs

కాంగ్రెస్ పాలనలో మిషన్ భగీరథ పై పర్యవేక్షణ కరువు  మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్

TNR NEWS

సావిత్రిబాయి పూలే జీవితం నేటి తరానికి ఆదర్శనీయం………  ఆదర్శ మహిళ సావిత్రిబాయి పూలే…..  కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి……..

TNR NEWS

కాల్వశ్రీరాంపూర్ లో పెద్దమ్మతల్లి బోనాలు

TNR NEWS

బెల్లంకొండ వెంకయ్య గారి చిత్ర పటానికి నివాళులర్పించిన బిఆర్ఎస్ పార్టీ కోదాడ నియోజకవర్గ ఇన్చార్జి,మాజీ శాసన సభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్

Harish Hs

కమ్మేసిన మంచు దుప్పటి

Harish Hs