Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

సుప్రీంకోర్టు స్టేను స్వాగతిస్తున్నాం – డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు మొహ్మద్ అలీ

హెచ్ సి యూ భూములను కార్పొరేట్ శక్తులకు అప్పగించొద్దుని హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం వేలం వేసి కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టాలనే ప్రయత్నంలో భాగంగా బుల్డోజర్లతో అక్కడి చెట్లను తొలగించి, భూమిని చదును చేసి, జంతువులకు తీవ్ర ఇబ్బంది కల్గించే చర్యలకు పాల్పడుతున్నది. దీన్ని వ్యతిరేకించిన విద్యార్థులపై లాఠీఛార్జీ, అరెస్టులు, అక్రమ కేసులు పెట్టి, జైలుకు పంపింది. ఈ నేపథ్యంలో ఇట్టి భూమిలో చెట్ల తొలగింపు, చదును చేయడం వెంటనే నిలిపివేయాలని సుప్రీంకోర్టు స్టే విధించడాన్ని డివైఎఫ్ఐ యువజన సంఘంగా స్వాగతిస్తున్నామని డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు మొహ్మద్ అలీ అన్నారు ఈ స్టేను దృష్టిలో పెట్టుకుని ఈ భూములను వేలం వేసే ప్రక్రియను ఉపసంహరించుకోవాలని, విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డివైఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇలాంటి చర్యలకు పూనుకుంటే భవిష్యత్లో రాష్ట్ర ప్రభుత్వంపై విద్యార్థులు, యువజనులు, మేధావులు, ప్రజా సంఘాలు, ప్రజలు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తామని అన్నారు.

Related posts

అంబులెన్స్ ఆకస్మిక తనిఖీ

TNR NEWS

కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ సర్పంచ్ వాడకొప్పుల సైదులు 

TNR NEWS

తాటాకు చప్పులకు భయపడను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

TNR NEWS

జాబితాపూర్ లో ఘనంగా చత్రపతి శివాజీ జయంతి వేడుకలు

TNR NEWS

యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మహ్మద్ అజీమ్ ఘన విజయం

TNR NEWS

డ్రగ్స్,సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన

TNR NEWS