Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

రోలుగుంట మండలం రాజన్నపేట క్వారీ పై అధికారుల విచారణ

  • చోడవరం జనసేన ఇంచార్జి పి.వి.ఎస్.ఎన్.రాజు ఫిర్యాదుతో అధికారుల్లో చలనం

 

  • జిల్లా కలెక్టర్ ఆదేశాలతో మైనింగ్ మరియు ఇరిగేషన్ శాఖల అధికారులు రాజన్నపేట క్వారీ పై క్షేత్ర స్థాయిలో ఉమ్మడి విచారణ

 

చోడవరం : రోలుగుంట మండలం రాజన్నపేట క్వారీ వలన కలుగుతున్న తీవ్ర ఇబ్బందులను, క్వారీ యజమానులు వ్యవసాయ చెరువు మధ్య నుండి అనధికారిక రహదారి నిర్మించడం వలన రైతుల పంటలపై తీవ్ర ప్రభావం ఏర్పడిందని, అందుచేత రెవిన్యూ మరియు నీటి పారుదల శాఖలతో విచారణ చెయ్యాలని తదుపరి ఆదేశాలు జారీ అయ్యే వరకు మైనింగ్ కార్యకలాపాలను నిలిపివేయాలని అభ్యర్థిస్తూ చోడవరం జనసేన ఇంచార్జి పి.వి.ఎస్.ఎన్.రాజు వ్యక్తిగతంగా అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్‌కు చేసిన ఫిర్యాదుతో ఎట్టకేలకు అధికారుల్లో చలనం వచ్చింది. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో మైనింగ్ మరియు ఇరిగేషన్ శాఖల అధికారులు రాజన్నపేట క్వారీ నందు క్షేత్ర స్థాయిలో ఉమ్మడి విచారణ చేపట్టారు. ఈ విచారణలో పలు అవకతవకలను  గుర్తించిన అధికారులు  మరింత లోతుగా విచారణ చెయ్యడానికి రెవెన్యు శాఖ అధికారులను కూడా రమ్మని కోరుతూ ఈ విచారణను ఈ నెల 17వ తేదీ చేపడతామని లిఖిత పూర్వకంగా తెలియ చేసారు. ఈ విచారణ నందు పి.వి.ఎస్.ఎన్.రాజు ప్రతినిధిగా బుంగా కోటిబాబు , స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

Related posts

ఆధ్యాత్మిక, తాత్విక జ్ఞానము ద్వారా మన సమస్యలు మనమే పరిష్కరించుకోగలుగుతాము – శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా

Dr Suneelkumar Yandra

మంగళగిరి వచ్చిన రాజేంద్రప్రసాద్ పవన్ తో మర్యాదపూర్వక భేటీ

TNR NEWS

బీజేపీ – అన్నాడీఎంకే కూటమికి శుభాకాంక్షలు

Dr Suneelkumar Yandra

శివుడే స్వయంగా సృష్టించిన పవిత్రక్షేత్రం..వారణాసి……!!

Dr Suneelkumar Yandra

బహుజనుల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి కాన్షీరాం

Dr Suneelkumar Yandra

శ్రీకాళహస్తి: స్వామివారి సేవలో సినీనటులు జీవిత రాజశేఖర్

TNR NEWS