Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

రోలుగుంట మండలం రాజన్నపేట క్వారీ పై అధికారుల విచారణ

  • చోడవరం జనసేన ఇంచార్జి పి.వి.ఎస్.ఎన్.రాజు ఫిర్యాదుతో అధికారుల్లో చలనం

 

  • జిల్లా కలెక్టర్ ఆదేశాలతో మైనింగ్ మరియు ఇరిగేషన్ శాఖల అధికారులు రాజన్నపేట క్వారీ పై క్షేత్ర స్థాయిలో ఉమ్మడి విచారణ

 

చోడవరం : రోలుగుంట మండలం రాజన్నపేట క్వారీ వలన కలుగుతున్న తీవ్ర ఇబ్బందులను, క్వారీ యజమానులు వ్యవసాయ చెరువు మధ్య నుండి అనధికారిక రహదారి నిర్మించడం వలన రైతుల పంటలపై తీవ్ర ప్రభావం ఏర్పడిందని, అందుచేత రెవిన్యూ మరియు నీటి పారుదల శాఖలతో విచారణ చెయ్యాలని తదుపరి ఆదేశాలు జారీ అయ్యే వరకు మైనింగ్ కార్యకలాపాలను నిలిపివేయాలని అభ్యర్థిస్తూ చోడవరం జనసేన ఇంచార్జి పి.వి.ఎస్.ఎన్.రాజు వ్యక్తిగతంగా అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్‌కు చేసిన ఫిర్యాదుతో ఎట్టకేలకు అధికారుల్లో చలనం వచ్చింది. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో మైనింగ్ మరియు ఇరిగేషన్ శాఖల అధికారులు రాజన్నపేట క్వారీ నందు క్షేత్ర స్థాయిలో ఉమ్మడి విచారణ చేపట్టారు. ఈ విచారణలో పలు అవకతవకలను  గుర్తించిన అధికారులు  మరింత లోతుగా విచారణ చెయ్యడానికి రెవెన్యు శాఖ అధికారులను కూడా రమ్మని కోరుతూ ఈ విచారణను ఈ నెల 17వ తేదీ చేపడతామని లిఖిత పూర్వకంగా తెలియ చేసారు. ఈ విచారణ నందు పి.వి.ఎస్.ఎన్.రాజు ప్రతినిధిగా బుంగా కోటిబాబు , స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

Related posts

విలీన గ్రామాలకు 70% ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయాలి.. లేకుంటే విలీన పెండింగ్ ప్రక్రియ పూర్తి చేసి కార్పోరేషన్ ఎన్నికలు నిర్వహించాలి

Dr Suneelkumar Yandra

వరద బాధితులను ఆదుకునేందుకు విశాఖ జిల్లా పార్టీ కార్యాలయంలో

TNR NEWS

పిఠాపురంలో చేయూత నిత్యాన్నదానం ప్రారంభం

Dr Suneelkumar Yandra

త్రేతాయుగ ప్రతీక “భద్రాచల పాదయాత్ర” – 14వార్షికాలు పూర్తి చేసిన గురుస్వామి వాసుదేవ ఆచార్యను సత్కరించిన గణపతి పీఠం

Dr Suneelkumar Yandra

పైసల్ కే సలాం  జెండా మోసిన వారికి అన్యాయం..!!

TNR NEWS

పారదర్శకంగా మద్యం షాపుల కేటాయింపు పూర్తి

TNR NEWS