Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

రోలుగుంట మండలం రాజన్నపేట క్వారీ పై అధికారుల విచారణ

  • చోడవరం జనసేన ఇంచార్జి పి.వి.ఎస్.ఎన్.రాజు ఫిర్యాదుతో అధికారుల్లో చలనం

 

  • జిల్లా కలెక్టర్ ఆదేశాలతో మైనింగ్ మరియు ఇరిగేషన్ శాఖల అధికారులు రాజన్నపేట క్వారీ పై క్షేత్ర స్థాయిలో ఉమ్మడి విచారణ

 

చోడవరం : రోలుగుంట మండలం రాజన్నపేట క్వారీ వలన కలుగుతున్న తీవ్ర ఇబ్బందులను, క్వారీ యజమానులు వ్యవసాయ చెరువు మధ్య నుండి అనధికారిక రహదారి నిర్మించడం వలన రైతుల పంటలపై తీవ్ర ప్రభావం ఏర్పడిందని, అందుచేత రెవిన్యూ మరియు నీటి పారుదల శాఖలతో విచారణ చెయ్యాలని తదుపరి ఆదేశాలు జారీ అయ్యే వరకు మైనింగ్ కార్యకలాపాలను నిలిపివేయాలని అభ్యర్థిస్తూ చోడవరం జనసేన ఇంచార్జి పి.వి.ఎస్.ఎన్.రాజు వ్యక్తిగతంగా అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్‌కు చేసిన ఫిర్యాదుతో ఎట్టకేలకు అధికారుల్లో చలనం వచ్చింది. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో మైనింగ్ మరియు ఇరిగేషన్ శాఖల అధికారులు రాజన్నపేట క్వారీ నందు క్షేత్ర స్థాయిలో ఉమ్మడి విచారణ చేపట్టారు. ఈ విచారణలో పలు అవకతవకలను  గుర్తించిన అధికారులు  మరింత లోతుగా విచారణ చెయ్యడానికి రెవెన్యు శాఖ అధికారులను కూడా రమ్మని కోరుతూ ఈ విచారణను ఈ నెల 17వ తేదీ చేపడతామని లిఖిత పూర్వకంగా తెలియ చేసారు. ఈ విచారణ నందు పి.వి.ఎస్.ఎన్.రాజు ప్రతినిధిగా బుంగా కోటిబాబు , స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

Related posts

నాపై కేసులన్నీ ఆరోపణలే – మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

Dr Suneelkumar Yandra

జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సార్వత్రిక వ్యాధి నిరోధక టీకాలు. జిల్లా డిఎంహెచ్వో వెంకట రవణ.

TNR NEWS

ఎమ్మెల్సీగా ఎన్నికయ్యేందుకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా అభినందనలు

Dr Suneelkumar Yandra

ఉగాది వేడుకల్లో పాల్గొన్న గౌరీ నాయుడు

Dr Suneelkumar Yandra

సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ శ్రీపతి

TNR NEWS

పీతల సత్యనారాయణ పదవీ విరమణ