Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

జనసేన ఖాతాలో తొలి మున్సిపాలిటీగా నిడదవోలు మున్సిపాలిటీ

  • జనసేన తీర్థం పుచ్చుకున్న 13 మంది వైసీపీ కాన్సిలర్లు

 

నిడదవోలు : జనసేన ఖాతాలో తొలి మున్సిపాలిటీగా నిడదవోలు మున్సిపాలిటీ చోటు దక్కించుకుంది. 13 మంది వైసీపీ కాన్సిలర్లు, టీడీపీ, ఎక్స్ అఫీషియోతో కలిపి జనసేన తీర్థం పుచ్చుకు న్నారు. దీంతో జనసేన బలం15కు చేరింది. ఏప్రిల్ 3న ఛైర్మెన్ పై అవిశ్వాసానికి తీర్మానం పెట్టాలంటూ వైసీపీ కౌన్సిలర్లు ఆర్డీవో మరియు కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేశారు. అయితే ఇంతలోనే మరికొంత మంది వైసీపీ కౌన్సిలర్లు జనసేన పార్టీలో చేరారు. దీంతో వారికి అవిశ్వాస తీర్మానానికి తగ్గ బలం సరిపడక అవిశ్వాస తీర్మానం వీగింది. జనసేన పార్టీకి తగిన బలం చేకూరడంతో నిడదవోలు మున్సిపాలిటీ తోలి జనసేన మున్సిపాలిటీగా జనసేన ఖాతాలో చేరింది. జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ భావజాలం మరియు నిదడవోలు ఎమెల్యే కందుల దుర్గేష్ సారథ్యంలో జరుగుతున్న నిడదవోలు అభివృద్ధి పనులు నచ్చి, మాపై నమ్మకం ఉంచి పార్టీలో చేరిన మున్సిపల్ కౌన్సిలర్లకు నిదడవోలు ఎమెల్యే, పర్యాటక శాఖా, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

 

Related posts

పిఠాపురం నియోజకవర్గానికి చెందిన యువకుడు దర్శకత్వంలో “శివాజ్ఞ”

బాణాసంచా పేలుడులో గాయపడిన కూలీలను ప్రభుత్వం ఆదుకోవాలి – పౌర సంక్షేమ సంఘం డిమాండ్

పారదర్శకంగా మద్యం షాపుల కేటాయింపు పూర్తి

TNR NEWS

నాడు – నేడు నిధులు అవకతవకలపై విచారణ చేపట్టాలి

Dr Suneelkumar Yandra

ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం – డా. వెంకటేశ్వర సతీష్‌ కుమార్‌

సమాజంలో పారిశుధ్య కార్మికుల పాత్ర కీలకం

Dr Suneelkumar Yandra