Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ పాఠశాలను కాపాడుకుందాం గోడ పత్రిక ఆవిష్కరణ

పిఠాపురం : స్థానిక సూర్య గ్రంధాలయంలో ప్రభుత్వ పాఠశాలను కాపాడుకుందాం అనే బృహత్తర ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ గోడ పత్రిక ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రచారం చేస్తూ ప్రభుత్వ పాఠశాలలో వచ్చే విద్యా సంవత్సరం ప్రవేశాలు పెంచుటకు సమాజంతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులను, ఇతర ప్రజా సంఘాలను భాగస్వామ్యం చేయాలని, తద్వారా పేద ప్రజలకు ప్రభుత్వ విద్య, నాణ్యమైన విద్య అందుబాటులో ఉంటుందని తెలియజేశారు. విద్యా వ్యవస్థ ప్రైవేటీకరణ పెరిగి పేద ప్రజల సంపాదనలో అధిక భాగం బడి ఫీజులు కట్టడానికి సరిపోతుందని, కావున ప్రభుత్వ విద్య కాపాడుకోవడం ద్వారా ప్రజలపై ఆర్థికభారం తగ్గుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక పిఠాపురం మండల అధ్యక్షుడు నరాల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు నారాయణ  మరొక ఉపాధ్యక్షుడు బి.సుబ్రహ్మణ్యం, గౌరవ అధ్యక్షుడు వి.సత్యనారాయణ రెడ్డి, కార్యకర్తలు కే.విశ్వనాథం, మన ఊరు మన బాధ్యత అధ్యక్షుడు కొండేపూడి శంకర్రావు, మధ్యపాన వ్యతిరేక కమిటీ సభ్యుడు నక్కా సూర్యనారాయణ, ఉపాధ్యాయులు ఎం.వి.వి.సత్యనారాయణ, ఏ.వి.రమణమూర్తి, ఎం.మాధవన్, జక్కతారావు, వి.పాములయ్య, శ్రీనివాస ఐటిఐ మాజీ పప్రిన్సిపాల్ బాలెం నూకరాజు పాల్గొన్నారు.

Related posts

సంక్రాంతి విశిష్టత ఏమిటి.. పెద్ద పండుగ ఎలా అయ్యింది !

Harish Hs

శివుడు ఎలా పుట్టాడో తెలుసా? శివుని జననం మరియు అవతారం యొక్క ఉత్తేజకరమైన కథ ఇక్కడ ఉంది.!!

Dr Suneelkumar Yandra

మోడే శ్రీనివాస్ కుటుంబానికి నిత్యవసర సరుకులు పంపిణీ

Dr Suneelkumar Yandra

రాష్ట్రస్థాయి వేదిక అవార్డు అందుకున్న16 మంది వివిఎస్ స్కూల్ విద్యార్థులు

Dr Suneelkumar Yandra

*వితంతు పింఛనుపై ప్రభుత్వం కీలక ఆదేశాలు* 

TNR NEWS

తిరుమలలో ట్రాఫిక్ నియంత్రణ: ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్:*

TNR NEWS