Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ పాఠశాలను కాపాడుకుందాం గోడ పత్రిక ఆవిష్కరణ

పిఠాపురం : స్థానిక సూర్య గ్రంధాలయంలో ప్రభుత్వ పాఠశాలను కాపాడుకుందాం అనే బృహత్తర ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ గోడ పత్రిక ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రచారం చేస్తూ ప్రభుత్వ పాఠశాలలో వచ్చే విద్యా సంవత్సరం ప్రవేశాలు పెంచుటకు సమాజంతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులను, ఇతర ప్రజా సంఘాలను భాగస్వామ్యం చేయాలని, తద్వారా పేద ప్రజలకు ప్రభుత్వ విద్య, నాణ్యమైన విద్య అందుబాటులో ఉంటుందని తెలియజేశారు. విద్యా వ్యవస్థ ప్రైవేటీకరణ పెరిగి పేద ప్రజల సంపాదనలో అధిక భాగం బడి ఫీజులు కట్టడానికి సరిపోతుందని, కావున ప్రభుత్వ విద్య కాపాడుకోవడం ద్వారా ప్రజలపై ఆర్థికభారం తగ్గుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక పిఠాపురం మండల అధ్యక్షుడు నరాల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు నారాయణ  మరొక ఉపాధ్యక్షుడు బి.సుబ్రహ్మణ్యం, గౌరవ అధ్యక్షుడు వి.సత్యనారాయణ రెడ్డి, కార్యకర్తలు కే.విశ్వనాథం, మన ఊరు మన బాధ్యత అధ్యక్షుడు కొండేపూడి శంకర్రావు, మధ్యపాన వ్యతిరేక కమిటీ సభ్యుడు నక్కా సూర్యనారాయణ, ఉపాధ్యాయులు ఎం.వి.వి.సత్యనారాయణ, ఏ.వి.రమణమూర్తి, ఎం.మాధవన్, జక్కతారావు, వి.పాములయ్య, శ్రీనివాస ఐటిఐ మాజీ పప్రిన్సిపాల్ బాలెం నూకరాజు పాల్గొన్నారు.

Related posts

వినియోగదారుల ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి

Dr Suneelkumar Yandra

ఓటర్ ఐడి కిఆధార్ అనుసంధానం పట్ల హర్షం

Dr Suneelkumar Yandra

స్మార్ట్ సిటీ సమ్మర్ స్టోరేజ్ అవసరాలు తీర్చాలి – పౌరసంక్షేమసంఘం డిమాండ్

Dr Suneelkumar Yandra

లలిత కళ పరిషత్‌ ఆధ్వర్యంలో ఘనంగా కవిశేఖర డాక్టర్‌ ఉమర్‌ ఆలీషా 140వజయంతి ఉత్సవాలు

రాష్ట్ర ర్యాంకులతో మొదటి ప్రయత్నంలోనే శ్యామ్ విద్యార్థులు

Dr Suneelkumar Yandra

పైసల్ కే సలాం  జెండా మోసిన వారికి అన్యాయం..!!

TNR NEWS