తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం బిఆర్ఎస్వి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బి ఆర్ ఎస్ వి పట్టణ అధ్యక్షులు బొర్ర వంశీ నాని ఆధ్వర్యంలో బిఆర్ ఏస్ శ్రేణులు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, బస్టాండ్ ఆవరణలో వికలాంగులకు, వృద్ధులకు, పేదలకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కెసిఆర్ తోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని గత 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు షేక్ నయిమ్,పట్టణ బి.అర్.ఎస్ పార్టీ నాయకులు బత్తుల ఉపేందర్,తాజుద్దీన్,సొంపంగు రాజు, కర్ల సుందర్ బాబు,నిసార్,కాసాని మల్లయ్య, బి.అర్.ఎస్వీ పట్టణ ఉపాధ్యక్షులు ఆసిఫ్,కార్యదర్శి నవీన్,తరుణ్ ,బి.అర్.ఎస్ నాయకులు గంధం శ్రీను,సైదులు, కలకొండ వెంకట్,పవన్, సాయి,సిద్దు తతిదర్లు పాల్గొన్నారు…………..

next post