Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ఎస్బీఐ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్  తలసేమియా బాధితులకు అండగా ఎస్బీఐ ఉద్యోగులు

సూర్యాపేట : తలసేమియా బాధితుల కోసం ఎస్బీఐ ఉద్యోగులు స్వచ్ఛందంగా రక్తదానం చేయడం అభినందనీయమని ఎస్బీఐ సూర్యాపేట రీజినల్ మేనేజర్ బి.అనిల్ కుమార్ అన్నారు.జులై 1న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 70 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా బుధవారం జిల్లా కేంద్రంలోని ఎంజీ రోడ్డులో గల ఎస్బీఐ టౌన్ బ్రాంచ్ లో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పదని అన్నారు. గత ఏడు దశాబ్దాలుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని వర్గాల ప్రజలకు సేవలు అందిస్తూ చేరువైందని అన్నారు.అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించుకొని ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తూ బ్యాంకింగ్ రంగంలో ముందుందని అన్నారు.రైతులకు, విద్యార్థులకు, మహిళ సంఘాలకు,వ్యాపార రంగాల వారికి వివిధ రకాల రుణాలను అందించి వారి అభివృద్ధికి తోడ్పడుతూ ముందుకు సాగుతున్నామన్నారు.పలు సామాజిక సేవా కార్యక్రమాలను కూడా ఎస్బీఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.మెగా రక్తదాన శిబిరం ద్వారా ఎస్బిఐ ఉద్యోగులు తలసేమియా బాధితులకు అండగా నిలబడటం అభినందనీయమని అన్నారు. 105 మంది ఉద్యోగులు రక్తదానం చేసినట్లు చెప్పారు. ఎస్బిఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్బీఐ ఉద్యోగుల రీజనల్ సెక్రెటరీ అయితగోని మహేష్, ఎస్బీఐ ఆఫీసర్స్ రీజనల్ సెక్రెటరీ విజయభాస్కర్, సేవా ఏజీఎస్ సురేందర్, టౌన్ బ్రాంచ్ మేనేజర్ సిహెచ్.ఫణి కుమార్, హెచ్ఆర్ మేనేజర్ విఠల్ బాబు, కిషోర్, క్రాంతి, అనిల్, మెడికల్ ఆఫీసర్ రాజ్ కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related posts

రజకుల సంక్షేమానికి బడ్జెట్ పెంచాలి

TNR NEWS

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Harish Hs

జ్యుయలరీ షాప్ ను ప్రారంభించిన:ప్రెస్ క్లబ్ జిల్లా అధ్యక్షులు అంజన్ గౌడ్  

TNR NEWS

కోదాడలో అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన

Harish Hs

ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కలిసిన వెలమ సంక్షేమ మండలి సభ్యులు

TNR NEWS

మట్టి విగ్రహాల నే పూజించాలి పర్యావరణాన్ని కాపాడాలి

TNR NEWS