Tnrnews.in
తెలంగాణ

ఎస్బీఐ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్  తలసేమియా బాధితులకు అండగా ఎస్బీఐ ఉద్యోగులు

సూర్యాపేట : తలసేమియా బాధితుల కోసం ఎస్బీఐ ఉద్యోగులు స్వచ్ఛందంగా రక్తదానం చేయడం అభినందనీయమని ఎస్బీఐ సూర్యాపేట రీజినల్ మేనేజర్ బి.అనిల్ కుమార్ అన్నారు.జులై 1న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 70 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా బుధవారం జిల్లా కేంద్రంలోని ఎంజీ రోడ్డులో గల ఎస్బీఐ టౌన్ బ్రాంచ్ లో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పదని అన్నారు. గత ఏడు దశాబ్దాలుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని వర్గాల ప్రజలకు సేవలు అందిస్తూ చేరువైందని అన్నారు.అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించుకొని ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తూ బ్యాంకింగ్ రంగంలో ముందుందని అన్నారు.రైతులకు, విద్యార్థులకు, మహిళ సంఘాలకు,వ్యాపార రంగాల వారికి వివిధ రకాల రుణాలను అందించి వారి అభివృద్ధికి తోడ్పడుతూ ముందుకు సాగుతున్నామన్నారు.పలు సామాజిక సేవా కార్యక్రమాలను కూడా ఎస్బీఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.మెగా రక్తదాన శిబిరం ద్వారా ఎస్బిఐ ఉద్యోగులు తలసేమియా బాధితులకు అండగా నిలబడటం అభినందనీయమని అన్నారు. 105 మంది ఉద్యోగులు రక్తదానం చేసినట్లు చెప్పారు. ఎస్బిఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్బీఐ ఉద్యోగుల రీజనల్ సెక్రెటరీ అయితగోని మహేష్, ఎస్బీఐ ఆఫీసర్స్ రీజనల్ సెక్రెటరీ విజయభాస్కర్, సేవా ఏజీఎస్ సురేందర్, టౌన్ బ్రాంచ్ మేనేజర్ సిహెచ్.ఫణి కుమార్, హెచ్ఆర్ మేనేజర్ విఠల్ బాబు, కిషోర్, క్రాంతి, అనిల్, మెడికల్ ఆఫీసర్ రాజ్ కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

సిఎం,మంత్రులు మల్లన్న సాగర్ నిర్వాసిత కాలనీలలో పర్యటించి వారి గోస వినాలి భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు చేయకపొవడం అన్యాయం డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి శంకర్ 

TNR NEWS

కమ్యూనిస్టుల పోరాట ఫలితమే శ్రీరామ్ సాగర్ రెండవ దశ నిర్మాణం…  శ్రీరామ్ సాగర్ రెండవ దశకు మాజీ పార్లమెంటు సభ్యులు కమ్యూనిస్టు నేత భీమిరెడ్డి నరసింహారెడ్డి పేరు పెట్టాలి.  రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి పేరు పెడతామని ముఖ్యమంత్రి ప్రకటించిన ప్రకటనను వెంటనే వెనక్కి తీసుకోవాలి.  సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు డిమాండ్

TNR NEWS

ప్రజా ఫిర్యాదులను పెండింగ్ ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలి. జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్

TNR NEWS

సెల్ ఫోన్ డ్రైవింగ్ ప్రమాదకరం

Harish Hs

కార్పెంటర్ కార్మికులందరూ ఐక్యంగా ఉండాలి

TNR NEWS

మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మార్పీఎస్ నాయకులు

Harish Hs