నీటిపారుదల శాఖ అధికారులకు మౌలిక సదుపాయాలు కల్పించి, రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం కోదాడ లో ఆయన రూ.54.03 కోట్లతో రాజీవ్ నగర్, రాజు శాంతినగర్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు, అలాగే రూ.5.10 కోట్లతో కోదాడలో నిర్మించే ఇరిగేషన్ డివిజన్ కార్యాలయం నూతన భవన నిర్మాణానికి సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కోదాడ నియోజకవర్గంలో 2.29 లక్షల ఎకరాలకు సాగునీరును పరిరక్షించే అధికారులకు కార్యాలయం 4 అంతస్తులతో 12 వేల చదరపు అడుగుల్లో నిర్మించడం జరుగుతుందని, వచ్చే జూన్ నాటికి నిర్మాణం పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను అధికారులను మంత్రి ఆదేశించారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:
