Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణవిద్య

చదువుతోపాటు నైపుణ్యం అవసరం

విద్యార్థులు శాస్త్ర సాంకేతిక రంగాల్లో రాణించి గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదగడానికి అటల్ టింకరింగ్ ల్యాబ్ లు ఎంతో దోహదపడుతుందని కోదాడ ఎంఈఓ సలీం షరీఫ్ తెలిపారు. బుధవారం పట్టణంలోని పీఎం శ్రీ బాయ్స్ హై స్కూల్ నందు కోదాడ, హుజూర్నగర్ రెండు డివిజన్ల పరిధిలోని పీఎం శ్రీ పాఠశాలల సైన్సు మరియు గణిత ఉపాధ్యాయులు 36 మందికి రెండు రోజులపాటు నిర్వహించిన శిక్షణ కార్యక్రమ ముగింపు సందర్భంగా వారి పాల్గొని మాట్లాడారు. విద్యార్థులకు చక్కటి గుణాత్మక విద్యను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 10 లక్షల రూపాయలతో ల్యాబ్ ను ఏర్పాటు చేసింది అన్నారు. నూతన ఆవిష్కరణలు, పరిశోధనలకు ల్యాబ్ లు దోహదం చేస్తాయన్నారు.జిల్లా సైన్స్ అధికారి లామ్ దేవరాజు మాట్లాడుతూ విద్యార్థులలో సైన్సు ఆసక్తిని పెంచి భావి భారత శాస్త్రవేత్తలుగా, ఆవిష్కర్తలుగా ఎదిగేందుకు కేంద్ర ప్రభుత్వం అటల్ టింకరింగ్ ల్యాబ్ లను ఏర్పాటు చేసిందన్నారు. రిసోర్స్ పర్సన్స్ కిషన్,ప్రశాంత్, రఘు లు రెండు రోజులపాటు ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కోదాడ, హుజూర్నగర్ సైన్స్,గణిత ఉపాధ్యాయులు పాల్గొన్నారు………

Related posts

ఘనంగా సుర్వి భువనేశ్వర్ గౌడ్ జన్మదిన వేడుకలు

TNR NEWS

సింగర్ రాజు ఎందరికో స్ఫూర్తి…సజ్జనార్ 

TNR NEWS

విద్యార్థులకు నాసిరకమైన భోజనం పెడితే జైల్ ఊచలు లెక్క పెట్టాల్సిందే

Harish Hs

మిర్చి రైతు వినూత్న ఆలోచన.. పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే..!

TNR NEWS

మాల సింహ గర్జన సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు 

TNR NEWS

అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి.  రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారుల ఎంపిక జరగాలి.  ఇందిరమ్మ కమిటీలను రద్దు చేయాలి.  సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు

TNR NEWS