Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

పెండింగ్ లో ఉన్న భవన నిర్మాణ కార్మికుల క్లైములను పరిష్కరించాలి.  భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షులు ఒగ్గు సైదులు

మోతే : పెండింగ్ లో ఉన్న భవన నిర్మాణ కార్మికుల క్లైమ్లను వెంటనే పరిష్కరించాలని భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షులు ఒగ్గు సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మోతే మండల కేంద్రంలో జరిగిన భవన నిర్మాణ కార్మిక సంఘం మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా భవన నిర్మాణ కార్మికుల క్లెయిమ్ లు పెండింగ్ లో ఉండటం మూలంగా కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెల్ఫేర్ బోర్డు నిధులు దారి మళ్లించి ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకొని ప్రభుత్వ వెల్ఫేర్ బోర్డు ద్వారానే నేరుగా సంక్షేమ పథకాలు కార్మికులకు అందించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట భవన నిర్మాణ కార్మిక సంఘం మండలం ఉపాధ్యక్షులు గట్టు శ్రీను, నాయకులు షేక్ సైదులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఘనంగా కేసీఆర్‌ జన్మదిన వేడుకలు ● ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేసిన బీఆర్ఎస్ నాయకులు

TNR NEWS

హోరాహోరీగా కోదాడ ప్రీమియర్ లీగ్ రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు

Harish Hs

ఆల్ ఇండియా బిసి, ఎస్ సి, ఎస్ టి, మైనారిటీ సంక్షేమ సంఘం – తెలంగాణ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా తూర్పు రమేష్

TNR NEWS

ఈ ప్రాంత ప్రజలకు తీవ్ర నష్టం కలిగించేఇథనాల్ కంపెనీ అనుమతులు వెంటనే రద్దు చేయాలి.  కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతికి వినతి పత్రం సమర్పించిన  ఇథనాల్ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు

TNR NEWS

కోదాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

TNR NEWS

తెలంగాణలో ఇవాళ్టి నుంచి డిగ్రీ, పీజీ కాలేజీలు బంద్‌ !

TNR NEWS