Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

పెండింగ్ లో ఉన్న భవన నిర్మాణ కార్మికుల క్లైములను పరిష్కరించాలి.  భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షులు ఒగ్గు సైదులు

మోతే : పెండింగ్ లో ఉన్న భవన నిర్మాణ కార్మికుల క్లైమ్లను వెంటనే పరిష్కరించాలని భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షులు ఒగ్గు సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మోతే మండల కేంద్రంలో జరిగిన భవన నిర్మాణ కార్మిక సంఘం మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా భవన నిర్మాణ కార్మికుల క్లెయిమ్ లు పెండింగ్ లో ఉండటం మూలంగా కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెల్ఫేర్ బోర్డు నిధులు దారి మళ్లించి ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకొని ప్రభుత్వ వెల్ఫేర్ బోర్డు ద్వారానే నేరుగా సంక్షేమ పథకాలు కార్మికులకు అందించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట భవన నిర్మాణ కార్మిక సంఘం మండలం ఉపాధ్యక్షులు గట్టు శ్రీను, నాయకులు షేక్ సైదులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

తల్లిదండ్రుల సమావేశం

TNR NEWS

ఎం జె ఎఫ్ బలోపేతానికి కృషి చేయాలి

Harish Hs

*నేడు ఎక్సైజ్ స్టేషన్‌లో ద్విచక్ర వాహనాల వేలం పాట*

TNR NEWS

రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికైన విద్యార్థి

TNR NEWS

ఎన్ఎంకె ఇథనాల్ కంపెనీ నిర్మాణాన్ని వెంటనే ఆపివేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు నేడు పాదయాత్ర  పాదయాత్రకు పలు సంఘాలు మద్దతు…

TNR NEWS

మునగాల మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

TNR NEWS