Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ది కోదాడ కాన్వాసింగ్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక.

ది కోదాడ కాన్వాసింగ్ అసోసియేషన్ నూతన కమిటీని గురువారం సంఘ సభ్యులంతా కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా అర్వపల్లి హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి గడ్డం రాంబాబు, ఉపాధ్యక్షులు చాప గోవిందరావు, సహాయ కార్యదర్శి ఓరుగంటి శ్రీనివాసరావు, కోశాధికారిగా సముద్రాల బద్రిష్ తో పాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు అభినందనలు తెలిపి మాట్లాడారు. మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిల సహకారంతో అసోసియేషన్ అభివృద్ధికి, సభ్యులకు, గుమస్తాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. సంఘ సభ్యులు అందరూ కలిసి ఎటువంటి ఎన్నికలు లేకుండా ఇతరులకు ఆదర్శంగా నిలిచే విధంగా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గం అసోసియేషన్ బలోపేతానికి కృషి చేయాలన్నారు.

 అనంతరం గుమస్తాల సంఘం కార్యవర్గానికి కూడా ఎన్నుకున్నారు.అధ్యక్షులుగా అనంతు సైదులు, ఉపాధ్యక్షులుగా వెంకట రాజారావు, ప్రధాన కార్యదర్శిగా వేమూరి నరసింహమూర్తి, సహాయ కార్యదర్శి పల్లా నాగరాజు, కోశాధికారిగా కొల్ల సురేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గట్ల కోటేశ్వరరావు సభా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు పిన్నపురెడ్డి వీరారెడ్డి, ఓరుగంటి ప్రభాకర్, వెంపటి వెంకటేశ్వరరావు, వెంపటి మధుసూదన్, ఓరుగంటి పురుషోత్తం, చల్ల ప్రకాష్, పర్వతాలు,అలీ భాయ్, రఘు,సాయి, వీరయ్య, గరినే శ్రీధర్, తూనం కృష్ణ,రామినేని శ్రీనివాసరావు, యలమందల నరసయ్య, కనగాల నాగేశ్వరరావు, ఆవుల రామారావు, తోట శ్రీను,పైడిమర్రి వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు……….

Related posts

గాయత్రి షుగర్స్ లో బీఎంఎస్ ఘనవిజయం

TNR NEWS

ఘనంగా అయ్యప్ప స్వామి మహా పడిపూజ.  అన్న ప్రసాద వితరణ

TNR NEWS

కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు బిల్లు ను ఉపసంహరించుకోవాలి

TNR NEWS

ఆచార్య చింతకింది సద్గుణకి ‘కల్చరల్ ప్రిజర్వేషన్ అండ్ నాలెడ్జ్ ఎక్సలెన్స్ అవార్డు’

TNR NEWS

మేధావుల సంఘీభావ సభకు తరలిరావాలి

Harish Hs

త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాబా ప్రతి పాధకన ప్రకారం ఓసిలకు ప్రత్యేకంగా స్థానాలు కేటాయించి ఆయా స్థానాలలో కేవలం ఓసి లు మాత్రమే పోటీ చేసేలా చట్టం తేవాలని సీఎం రేవంత్ రెడ్డికి ఎక్స్ వేదికగా విన్నవించిన. సామాజిక ఉద్యమకారుడు డాక్టర్ వేమూరి సత్యనారాయణ.    

TNR NEWS