Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

పెండింగ్లో ఉన్న పిఆర్సి,డిఏ లను విడుదల చేయాలి

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికై 23న హైదరాబాదులో జరిగే ధర్నాకు ఉద్యోగులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిరికొండ అనిల్ కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం కోదాడ పట్టణంలో టీఎస్ యుటిఎఫ్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులకు సభ్యత్వాలను అందజేసి మాట్లాడారు. గత ప్రభుత్వంలో విద్యారంగం పూర్తిగా సమస్యలతో వెనుకబడిపోయిందని ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందన్నారు.పెండింగ్లో ఉన్న పీఆర్సీలు డీఏలను విడుదల చేయాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కార్యదర్శి పాండురంగ చారి, కోదాడ టౌన్ ప్రధాన కార్యదర్శి సైదిరెడ్డి, కోదాడ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మైసయ్య, శ్రీనివాసరావు, బుల్లయ్య తదితరులు పాల్గొన్నారు……….

Related posts

*ఎమ్మార్పీఎస్, ఎం జె ఎఫ్ ఆధ్వర్యంలో 75 వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు*

Harish Hs

విద్య ద్వారా పేదరికం నుంచి శాశ్వతంగా విముక్తి….. అదనపు కలెక్టర్ డి.వేణు మైనారిటీ సంక్షేమ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అదనపు కలెక్టర్

TNR NEWS

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

TNR NEWS

అయ్యప్ప మాలధారులకు అన్నప్రాసద వితరణ

Harish Hs

మాస్టర్ మైండ్స్ పాఠశాలలో గణిత దినోత్సవం 

TNR NEWS

చిన్న వర్షానికే ప్రమాదకరంగా మారిన డబుల్ రోడ్డు రోడ్డు వేశారు సూచిక బోర్డులు మరిచారు

TNR NEWS