Tnrnews.in
తెలంగాణరాజకీయం

చేర్యాల ప్రాంత రైతాంగానికి కాంగ్రెస్ ముసుగులో ఉన్న జేఏసీ నాయకులు క్షమాపణ చెప్పాలి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శెట్టిపల్లి సత్తిరెడ్డి

కొమురవేల్లి మండలంలోని తపాస్ పల్లి రిజర్వాయర్ నీటితో చేర్యాల ప్రాంత చెరువులు కుంటలు నింపాలని సిపిఎం పార్టీ సిద్దిపేట జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శెట్టిపల్లి సత్తిరెడ్డి డిమాండ్ చేశారు.చేర్యాల సిపిఎం పార్టీ ఆఫీస్ లో జిల్లా కమిటీ సభ్యులు కొంగరి వెంకట్ మావో అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ చేర్యాల ప్రాంతంలో ఉన్న చెరువులు కుంటలు నింపడం కోసం నిర్మించిన తపాస్ పల్లి రిజర్వాయర్ నీటిని కాంగ్రెస్ నాయకులు వారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా తపాస్ పల్లి రిజర్వాయర్ నుంచి నీటిని యదేచ్చగా తీసుకుపోతుంటే స్థానిక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జనగామ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఏం చేస్తున్నాడో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.చేతకాని వారిలాగా చూస్తూ కూర్చున్న కాంగ్రెస్ నాయకులు జేఏసీ పేరుతో రైతులను మోసగించే ప్రకటనలు మానుకోవాలని ఆయన హెచ్చరించారు.ఈ ప్రాంతం మీద ప్రేమ ఉంటే నీటిని తీసుకుపోతుంటే మీరు ఏం చేస్తున్నారు అని ఆయన ప్రశ్నించారు.తపస్ పల్లి రిజర్వాయర్ నీటిని చేర్యాల ప్రాంతంలో ఉన్న అన్ని చెరువులు కుంటలు కాలువల ద్వారా నింపాలని కాలువల లేని చెరువులకు కాలువలు తవ్వి నింపాలని లేని పక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రైతులను ప్రజలను ఏకంచేసి ఈ ప్రాంత చెరువులు కుంటలు నింపే వరకు ప్రత్యక్ష పోరాటాలు నిర్వహిస్తామని ఆయనే హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు తాడూరు రవీందర్ బద్దిపడగ కృష్ణారెడ్డి దాసరి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి

Harish Hs

విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన భోజనం అందించాలి

TNR NEWS

గాయత్రి విద్యానికేతన్ లో హెల్త్ క్యాంప్

TNR NEWS

ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న (04 ) ట్రాక్టర్లను పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు

TNR NEWS

సిఐటియు ఓదెల మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా ఓదెల రెవెన్యూ ఇన్స్పెక్టర్ మహేష్ కి వినతి పత్రం అందించారు

TNR NEWS

విద్యార్థులు క్రీడల్లో రాణించి సూర్యాపేట జిల్లాకు పేరు తేవాలి

Harish Hs