Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

మట్టి వినాయకుణ్ణి పూజించండి… పర్యావరణాన్ని కాపాడండి – పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా

హైదరాబాద్ : మట్టి వినాయకుని పూజించండి పర్యావరణాన్ని కాపాడండి అంటూ శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా అన్నారు. ఉమర్ ఆలీషా రూరల్ డవలప్మెంట్ ట్రస్ట్ మరియు జీవనది ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఘట్టుపల్లి ఆశ్రమంలో మట్టి వినాయకుల ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత అని, ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. రసాయనరంగులతో తయారుచేసిన విగ్రహాలను వాడడంతో పర్యావరణం కాలుష్యం అవుతుందని అందుచేత ప్రతి ఒక్కరు మట్టి వినాయక ప్రతిమలను పూజించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జీవనది ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు ఇంటి లక్ష్మీదుర్గ, ఘట్టుపల్లి ఆశ్రమ సభ్యులు స్వర్ణలత, సూర్యలత తదితరులు పాల్గొన్నారు.

Related posts

పబ్లిక్ క్లబ్ అభివృద్ధికి కృషి పబ్లిక్ క్లబ్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ భూమి పూజ

TNR NEWS

మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని రైతులను వెంటనే విడుదల చేయాలి బిఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు కుర్ర సావిత్రి

TNR NEWS

కుప్టీ ఘాటులో లారీ–బస్సు ఢీ : ఇద్దరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు

TNR NEWS

జిన్నారంలో గుట్టపై భక్తుల సందడి 

TNR NEWS

తెలంగాణ లో బీసీలకు 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు కాకపోవడానికి ప్రధాన కారణం బిజెపి  బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలుకు వ్యతిరేకంగా ఉన్న బీజేపీని గద్దె దింపాలి.  సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు

TNR NEWS

తెలంగాణ రాష్ట్ర మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షుడిగా చిర్రా శ్రీనివాస్

Harish Hs