Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

మట్టి వినాయకుణ్ణి పూజించండి… పర్యావరణాన్ని కాపాడండి – పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా

హైదరాబాద్ : మట్టి వినాయకుని పూజించండి పర్యావరణాన్ని కాపాడండి అంటూ శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా అన్నారు. ఉమర్ ఆలీషా రూరల్ డవలప్మెంట్ ట్రస్ట్ మరియు జీవనది ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఘట్టుపల్లి ఆశ్రమంలో మట్టి వినాయకుల ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత అని, ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. రసాయనరంగులతో తయారుచేసిన విగ్రహాలను వాడడంతో పర్యావరణం కాలుష్యం అవుతుందని అందుచేత ప్రతి ఒక్కరు మట్టి వినాయక ప్రతిమలను పూజించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జీవనది ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు ఇంటి లక్ష్మీదుర్గ, ఘట్టుపల్లి ఆశ్రమ సభ్యులు స్వర్ణలత, సూర్యలత తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం  మండల విద్యాధికారి నిమ్మ రాజిరెడ్డి. 

TNR NEWS

సూర్యాపేట జిల్లా ఎస్పీ గా కె. నరసింహ

Harish Hs

సైబర్ నేరాల పై అవగాహన

TNR NEWS

స్వాతంత్ర సమరయోధుల ఎగ్జిబిషన్ ను జయప్రదం చేయండి.     -ఆవాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ జహంగీర్

TNR NEWS

గాయత్రి విద్యానికేతన్ లో హెల్త్ క్యాంప్

TNR NEWS

ఆపదలో అండగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు  కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి

TNR NEWS