Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

మండల రైతాంగానికి పోలీసువారి విజ్ఞప్తి ధాన్యం సేకరణ ,ఆరబెట్టడం, అమ్మకాలలో నిర్లక్ష్యం వహిస్తే ప్రమాదం పొంచి ఉంది రైతులు, ట్రాక్టర్ డ్రైవర్ల జాగ్రత్త వహించాలి . మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్

 

టిఎన్ఆర్ న్యూస్ రిపోర్టర్ హరీష్ కోదాడ

రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను సేకరించేటప్పుడు మరియు రోడ్లపై ఆరబెట్టేటప్పుడు అదేవిధంగా ధాన్యాన్ని అమ్మకం కోసం కొనుగోలు కేంద్రాలకు లేదా రైస్ మిల్లులకు తరలించేటప్పుడు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే అనుకోని ప్రమాదాలు సంభవించి ప్రాణ నష్టం మరియు ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉంటుందని కావున రైతులు ట్రాక్టర్ డ్రైవర్లు మరియు వివిధ వాహనాల డ్రైవర్లు తప్పనిసరిగా తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు, రైతులు తాము పండించిన ధాన్యాన్ని గ్రామీణ ప్రాంతాలలో రోడ్లపైనే ఆరబెడుతూ మరియు ధాన్యం కాటాలు వేస్తూ, కాటాలు వేసిన ధాన్యం బస్తాలు రోడ్డుపై నిలువ చేస్తూ ధాన్యం రాశుల బస్తాల చుట్టూ రాళ్లు పెడుతూ ప్రతినిత్యం రోడ్డుపై వెళ్లే వాహనదారులకు మరియు ద్విచక్ర వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నారని, కొన్ని సందర్భాలలో రోడ్డుపై పెట్టిన రాళ్లు తీయకపోవడం ద్వారా అనుకోని ప్రమాదాలు సంభవించి ప్రాణా నష్టం కూడా జరుగుతుందని వారు తెలిపారు, అదే విధంగా

రైతన్నలు వడ్లను పొలాల దగ్గర నుంచి మిల్లుకు ట్రాక్టర్ల మీద బోరేం లతో తీసుకు వెళుతున్న సమయంలో తమ ట్రాక్టర్లకు ఎక్కువ శబ్దం వచ్చేటట్లు పాటలు పెట్టుకుని వెళ్తున్నారు.దాని వలన వెనకనుంచి వచ్చే వాహనాల హారన్ శబ్దం వినపడక ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నదని. కావున ధాన్యం సేకరణ మరియు ఆరబెట్టి నిల్వ చేయడం మార్కెట్ కు అమ్మకానికి తరలించే విషయంలో రైతులు తగిన జాగ్రత్త చర్యలు తీసుకొని ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని వారు కోరారు.

Related posts

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి – సోషల్ మీడియాతో జాగ్రత్తగా ఉండాలి – ఎవరో చెప్పే మాయ మాటలు విని మోసపోవద్దు – సీనియర్ జూనియర్ అని చూడకుండా స్నేహభావంతో కలిసిమెలిసి ఉండాలి – గజ్వేల్ రూరల్ సిఐ మహేందర్ రెడ్డి

TNR NEWS

శాంతి భద్రతల పరిరక్షణలో సూర్యాపేట జిల్లా పోలీస్ పనితీరు అమోఘం.. ప్రజల భాగస్వామ్యంతోనే నేరాల కట్టడి పోలీసులు పారదర్శకంగా పనిచేయాలి.. ప్రజలకు అందుబాటులో ఉండాలి సూర్యాపేట జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్…

TNR NEWS

మీడియా సమాజానికి అద్దం లాంటిదని జిల్లా కలెక్టర్ :ఇలా త్రిపాఠి

TNR NEWS

గుడ్ న్యూస్..త్వరలో పంచాయతీలకు పెండింగ్ బిల్లులు..!!

TNR NEWS

సీసీ కెమెరాలను ఏర్పాటుతో నేరాలు నియంత్రణ  – సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి  – బెల్ట్ షాపులు, గుడుంబా అమ్మకాలు పూర్తిస్థాయిలో నివారించాలి – వాహనాలకు ఇన్సూరెన్స్ రిజిస్ట్రేషన్ పత్రాలు కలిగి ఉండాలి – పరకాల ఏసీబీ సతీష్ 

TNR NEWS

మాట ఇచ్చి నిలబెట్టుకున్న నాయకులు బాజపా మండల అధ్యక్షుడు రాజపాల్ రెడ్డి   పసుపు బోర్డు ఏర్పాటు ఫై మోడీ, అరవింద్ చిత్రపటాలకు రైతుల పాలాభిషేకం..

TNR NEWS