కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి బైక్ చోరీ చేసిన ఘటన మంగళవారం బిచ్కుంద పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని దెగ్లూర్ చెందిన ఓ వ్యక్తి బిచ్కుందకు వస్తుండగా మద్నూరు మండలం మీర్జాపూర్ వద్ద ఓ యువకుడు లిఫ్టు అడిగాడు. ఇద్దరు కలిసి రాజుల గ్రామం మీద గా బిచ్కుంద వస్తున్నారు. ఈ క్రమంలో రాజుల సమీపంలో బైక్ ఆపి యజమాని మూత్రం పోయడానికి వెళ్లగా లిఫ్ట్ అడిగిన వ్యక్తి బైక్ తీసుకొని పరారయ్యాడు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మోహన్ రెడ్డి తెలిపారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:
