Tnrnews.in
తెలంగాణవిద్య

జగన్నాధపురం పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం.

మునగాల మండలం పరిధిలోని జగన్నాధపురం ప్రాథమికోన్నత పాఠశాలలో గురువారం భారతదేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రు జన్మదినాన్ని పురస్కరించుకొని ఘనంగా బాలల దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నెహ్రూ గారి పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బాలల దినోత్సవ సందర్భంగా పిల్లలకు ఆటపాటలు ,క్విజ్ అహల్లాదకరమైన వాతావరణంలో నిర్వహించి పిల్లలకు బహుమతి ప్రధానోత్సవం కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. సతీష్ కుమార్, సహోపాధ్యాయులు వక్కంతుల భరత్ బాబు, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ వి. నాగమణి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు వి. భరత్ బాబు విద్యార్థులందరికీ నోటు పుస్తకములు బహుకరించటంజరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లల యొక్క భవిష్యత్తు తరగతి గదిలోనే ప్రారంభమవుతుందని, మన దేశ తొలి ప్రధాని వ్యాఖ్యానించిన అంశాలను ప్రస్తిస్తూ ఆ గురుతర బాధ్యత ఉపాధ్యాయులపై, తల్లిదండ్రులపై, సమాజంపై ఉంటుందని, నేటి బాలురే రేపటి భావి భారత పౌరులుగా దేశానికి దిక్సూచిగా దిశా నిర్దేశం చేయగలరని, విజ్ఞాన దీపికలు కాగలరని, బాల్యము క్రమశిక్షణతో ఆటపాటలతో ఆనందకరంగా విజ్ఞానదాయకంగా ఉండాలని తెలియజేసినారు.

ఉపాధ్యాయుడు ఒక్కంతుల భరత్ బాబు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం బాలల దినోత్సవం రోజు అన్ని తరగతులలో చదువులో ఆటలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతి ప్రధానోత్సవం చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ప్రజల సమస్యలు వదిలేసి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు…  సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి

TNR NEWS

కోదాడ ఎక్సైజ్ స్టేషన్ నందు బహిరంగ వేలంపాట

TNR NEWS

విద్యార్థుల మధ్యాహ్న భోజనం తనిఖీ 

TNR NEWS

తాటాకు చప్పులకు భయపడను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

TNR NEWS

నిబంధనలు అతిక్రమించి వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవు

Harish Hs

కుటుంబ సమేతంగా మల్లన్న దర్శనం చేసుకున్న టీపీసీసీ అధికార ప్రతినిధి ఐఎన్టియూసి రాష్ట్ర ఉపాధ్యక్షులు మొగుళ్ల రాజి రెడ్డి* *జనగామ నియోజకవర్గం అభివృద్ధికి పాటు పడతా మొగుళ్ల రాజిరెడ్డి

TNR NEWS