Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

పేదలకు పథకాలు గుర్తించి ఇవ్వడం హర్షనీయం ఫైలేట్ ప్రాజెక్ట్ గా గుడిబండ గ్రామం ఎన్నిక ఎన్నిక చేసినందుకు కోదాడ ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం

అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయి అని జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తుమాటి వరప్రసాద్ రెడ్డి ఆదివారం అన్నారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని గుడిబండ గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్ట్ గా ఎంపిక చేసి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ప్రజా పాలన పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని,ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ పలువురు నాయకులు మాట్లాడారు.సంక్షేమ పథకాలను ప్రారంభిస్తున్నామని ఇప్పటినుండి ప్రారంభం అవుతాయి అని తెలియజేశారు.ఈ ప్రక్రియ నిరంతరం ఉంటుంది అని తెలిపారు. ఆర్డిఓ సూర్యనారాయణ తో కలిసి ప్రజా పాలన సంక్షేమ పథకాలను ప్రారంభించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు నిర్వహించారు. పథకానికి ఒక కౌంటర్ ను ఏర్పాటు చేసి అధికారుల ద్వారా సంక్షేమ పథకానికి సంబంధించిన పత్రాలను అందించారు. అనంతరం ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి చిత్రపటాలకు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలోతాసిల్దార్ వాజిద్ అలీ, ఏవో రజిని, ఉపాధ్యక్షుడు ఇర్ల సీతారాంరెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ లు ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి, నలజాల శ్రీనివాసరావు, నాయకులు నాగిరెడ్డి, నర్సిరెడ్డి, కుక్కడపు నాగరాజు, సైదులు పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

వెలగని హైమక్స్ లైట్స్

TNR NEWS

ప్రపంచ మానవాళికి ఎర్ర జెండా దిక్చూచిగా నిలిచింది.  *దేశ భవిష్యత్తును మార్చేది సోషలిజమే  *దోపిడి,పీడన, ఉన్నంతకాలం కమ్యూనిజం అజెయo  సిపిఎం జిల్లా మహాసభలను జయప్రదం చేయండి.   సిపిఎంరాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి…

TNR NEWS

మద్నూర్ లో మహాత్మా గాంధీ వర్ధంతి

TNR NEWS

సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల శాంతియుత నిరసన దీక్ష

TNR NEWS

తెలంగాణ – టర్కీ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు  టర్కీ రాయబారి ఫిరాట్‌ సునెల్‌తో మంత్రి దామోదర్‌ భేటీ

TNR NEWS

అనంతగిరి అర్బన్ పార్క్ ను శంకుస్థాపన చేసిన స్పీకర్

TNR NEWS