Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణవిద్య

విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వ చెలగాటం స్కాలర్‌షిప్‌ నిధులివ్వాలి కళ్లకు గంతలతో ఏఐఎస్‌ఎఫ్‌ నిరసన

 

కరీంనగర్‌ ఎడ్యుకేషన్‌:

పెండిరగులో ఉన్న స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు విడుదల చేయకుండా ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్‌ ఆరోపించారు. పెండిరగులో ఉన్న స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు విడుదల చేయాలని బుధవారం కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రమేశ్‌ మాట్లాడుతూ నెల రోజుల్లో బకాయిలు విడుదల చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ, ఇంకా విడుదల చేయలేదన్నారు. ప్రభుత్వం చూసిచూడనట్టుగా వ్యవహరిస్తోందని, దీంతో పేద విద్యార్థులు ఉన్నత చదువులు మధ్యలోనే ఆపేయాల్సిన పరిస్థితి తలెత్తుతోందన్నారు. అటు చదువులు కొనసాగించలేక, ఇటు మధ్యలో ఆపేయలేక విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంలో పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పెండిరగులో ఉన్న స్కాలర్షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు కసిరెడ్డి సందీప్‌ రెడ్డి, మచ్చ అభిలాష్‌, శ్రీనివాస్‌, నరేష్‌, సురేష్‌, రవి, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Related posts

గ్రాండ్ టెస్ట్ విజేతలకు నేడు బహుమతుల ప్రధానోత్సవం

Harish Hs

కందుల కొనుగోలు కేంద్రంను ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా వ్యవసాయానికి కేసీఆర్ చేసినంత సేవ దేశ చరిత్రలో ఎవరూ చేయలేదు రైతన్నల హామీలు ఇవ్వకపోతే అన్నదాతలతో కలిసి కొట్లాడుతాం అవినీతి రహితంగా కొనుగోలు కేంద్రాన్ని చేపట్టాలి జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి

TNR NEWS

ప్రశాంతంగా ముగిసిన పదవ తరగతి తొలి రోజు పరీక్ష మొత్తం 2343 మందికి 2339 మంది హజరు …. నలుగురే గైర్హాజరు

TNR NEWS

ఇండియన్ ఒలంపియాడ్ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంస పత్రం అందజేత..

TNR NEWS

నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించడం ఎమ్మెల్యే

TNR NEWS

పురపాలక సంఘం కార్యాలయంలో సమావేశం. పురపాలక సంఘం స్పెషల్ ఆఫీసర్ గా అదనప కలెక్టర్ సుధీర్.

TNR NEWS