Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

గుడి కందుల ఉన్నత పాఠశాలలో సీసీ కెమెరాల ఏర్పాటు.

 

మండలం లోని గుడికందుల ఉన్నత పాఠశాలకు 4 సీసీ కెమెరాలు, మానిటర్ ను బుధవారం రోజున దాత ఎన్ఫోర్స్మెంట్ సబ్ ఇన్స్పెక్టర్ అంబిగల్ల సాయి ప్రసాద్ అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మిరుదొడ్డి పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ పరశురాం, తొగుట మండల విద్యాధికారి వడ్లకొండ నరసయ్య, దాత సాయి ప్రసాదును ఘనంగా సన్మానించారు. ఎస్సై పరశు రామ్ మాట్లాడుతూ పాఠశాల ఆవరణలో ఎలాంటి అసాంఘిక, అనైతిక కార్యక్రమా లకు పాల్పడ్డా వాటిని నిరోధించేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. పాఠశాలలో పూల, క్రోటన్ మొక్కలు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయన్నారు. విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. అనంతరం సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి మొక్కలను నాటారు. ఈ కార్యక్రమములో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పరపాటకం అంజిరెడ్డి, ఉపాధ్యాయులు సోమ గారి నాగిరెడ్డి, వేణుమాధవ్, హనుమారెడ్డి, కనక రాములు ,రవీందర్ రెడ్డి, శివయ్య ,భాస్కర్ రెడ్డి, పర్వేజ్, బండారి లావణ్య, అనసూయ సిఆర్పి వెంకటస్వామి మరియు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

‘భూభారతి చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలి’

TNR NEWS

*తెలంగాణ రాష్ట్రంలో సుపరిపాలన అందించడమే లక్ష్యం గా కుల గణన చేపట్టాం-ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్*

TNR NEWS

జాబితాపూర్ లో ఘనంగా చత్రపతి శివాజీ జయంతి వేడుకలు

TNR NEWS

డ్రగ్స్,సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన

TNR NEWS

ప్రజా పాలనలో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వరా? పేదలకు ఎన్నికల హామీలు అమలు చేయకపోతే ఉధృత పోరాటాలు తప్పవు రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని వెంటనే అమలు చేయాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

TNR NEWS

ఎం జె ఎఫ్ బలోపేతానికి కృషి చేయాలి

Harish Hs