Tnrnews.in
తెలంగాణ

గుడి కందుల ఉన్నత పాఠశాలలో సీసీ కెమెరాల ఏర్పాటు.

 

మండలం లోని గుడికందుల ఉన్నత పాఠశాలకు 4 సీసీ కెమెరాలు, మానిటర్ ను బుధవారం రోజున దాత ఎన్ఫోర్స్మెంట్ సబ్ ఇన్స్పెక్టర్ అంబిగల్ల సాయి ప్రసాద్ అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మిరుదొడ్డి పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ పరశురాం, తొగుట మండల విద్యాధికారి వడ్లకొండ నరసయ్య, దాత సాయి ప్రసాదును ఘనంగా సన్మానించారు. ఎస్సై పరశు రామ్ మాట్లాడుతూ పాఠశాల ఆవరణలో ఎలాంటి అసాంఘిక, అనైతిక కార్యక్రమా లకు పాల్పడ్డా వాటిని నిరోధించేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. పాఠశాలలో పూల, క్రోటన్ మొక్కలు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయన్నారు. విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. అనంతరం సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి మొక్కలను నాటారు. ఈ కార్యక్రమములో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పరపాటకం అంజిరెడ్డి, ఉపాధ్యాయులు సోమ గారి నాగిరెడ్డి, వేణుమాధవ్, హనుమారెడ్డి, కనక రాములు ,రవీందర్ రెడ్డి, శివయ్య ,భాస్కర్ రెడ్డి, పర్వేజ్, బండారి లావణ్య, అనసూయ సిఆర్పి వెంకటస్వామి మరియు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

*శ్రీ ధర్మశాస్త అన్నదాన సేవాసమితి ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం ప్రారంభించిన డిఎస్పి రవి*

Harish Hs

ముగిసిన ప్రకాశ్‌రాజ్ ఈడీ విచారణ

TNR NEWS

పట్టణ భూమిలేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని వర్తింప చేయాలి.  సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎల్గూరి గోవిందు, సిపిఎం వన్ టౌన్ కార్యదర్శి వల్లపు దాసు సాయికుమార్

TNR NEWS

ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

TNR NEWS

రైతుల వరి కొనుగోలు కోసం కలెక్టర్ కు వినతి పత్రం

TNR NEWS

ట్రాఫిక్ నియమాలు పాటించాలి:కోదాడ పట్టణ సీఐ శివ శంకర్

TNR NEWS