Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

విద్యార్థులకు గణిత ప్రతిభా పరీక్షలు

: తెలంగాణ గణిత ఫోరం ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు మండల స్థాయి ప్రతిభా పరీక్షలు నిర్వహించి విద్యార్థుల మేధస్సును గుర్తించడం జరిగిందని తెలంగాణ గణిత ఫోరం మండల అధ్యక్షులు షకీల్ పాష అన్నారు. సోమవారం దౌల్తాబాద్ మండల కేంద్రం జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాలలో మండల స్థాయి ప్రతిభా పరీక్షలు, క్విజ్ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు, సర్టిఫికెట్ లు అందజేయడం జరిగిందన్నారు. మండల స్థాయి ఇంగ్లీష్ మీడియంలో ప్రతిభా పరీక్షలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు ప్రథమ స్థానం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇందుప్రియాల్ ఈ.అనూష, ద్వితీయ స్థానం జి. క్రిష్ణేశ్వరి,తృతీయ స్థానం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముబారస్ పూర్ షేక్ రహ్మేత్ ఉన్నిస.తెలుగు మీడియంలో ప్రథమ స్థానం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దొమ్మాట ఏ. ఆకాంక్ష, ద్వితీయ స్థానం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దొమ్మాట ఈ. చందన తృతీయ స్థానం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలుర దౌల్తాబాద్ ఏ. రామ్ చరణ్ విద్యార్థులు గెలుపొందారు. వీరు డిసెంబర్ 11న సిద్దిపేట జిల్లా కొడకండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగే జిల్లా స్థాయి పోటీలలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు అఫ్జల్ హుస్సేన్, ఉపాధ్యాయులు నర్సింలు, సుధాకర్, రాజయ్య, జంపన్న, మహిపాల్, మహేష్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Related posts

జోగిపేట వ్యాపారి వినయ్‌పై టోల్‌ప్లాజా సిబ్బంది దాడి  సంగారెడ్డి ఆసుపత్రికి తరలింపు

TNR NEWS

లక్షల డప్పులు వేల గొంతుల కార్యక్రమానికి టీజీ ఎంఆర్పిఎస్ సంపూర్ణ మద్దతు

Harish Hs

రాష్ట్రస్థాయి పోటీలకు మోడల్ స్కూల్ విద్యార్థులు

TNR NEWS

కోదాడ క్లస్టర్ ఉద్వాన విస్తరణ అధికారిగా రాజు

TNR NEWS

జగదీష్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేస్తున్న మండల కాంగ్రెస్ నాయకులు

TNR NEWS

లచ్చయ్య మృతదేహానికి నివాళులు అర్పించిన సొసైటీ చైర్మన్ డైరెక్టర్లు

Harish Hs