Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

జోగిపేట వ్యాపారి వినయ్‌పై టోల్‌ప్లాజా సిబ్బంది దాడి  సంగారెడ్డి ఆసుపత్రికి తరలింపు

జోగిపేటః సంగారెడ్డి జిల్లా తాడ్దాన్‌పల్లి టోల్‌ప్లాజా వద్ద జోగిపేటకు చెందిన వ్యాపారస్తుడు కటుకం ప్రవీణ్‌ కుమారుడు కటుకం వినయ్‌ కుమార్‌పై టోల్‌గేట్‌ సిబ్బంది రాడ్‌తో దాడి చేయడంతో వినయ్‌ తలపగిలి పోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. శుక్రవారం జోగిపేట వైపు నుంచి సంగారెడ్డికి వినయ్‌ తన స్నేహితులతో కలిసి టీఆర్‌ నంబరు గల కొత్త కారులో వెళుతూ టోల్‌టాక్స్‌ వద్ద లోకల్‌ అని చెప్పినా సిబ్బంది వినిపించుకోకుండా దురుసుగా ప్రవర్తించడంతో ఇరువురి మద్య మాటా మాటా పెరిగి గొడవకు దారితీసింది. దీంతో చాలా సేపటి వరకు ఉద్రిక్తత ఏర్పడింది. టోల్‌ ప్లాజా సిబ్బంది అక్కడే ఉన్న ఇనుప రాడ్‌తో వినయ్‌ తలపై బలంగా కొట్టడంతో రక్తస్రావం అయ్యింది. దీంతో అక్కడికి చేరుకున్న వినయ్‌ స్నేహితులు దాడి చేసిన వ్యక్తి కోసం ఆ ప్రాంతమంతా గాలించారు. దాడి చేసిన వ్యక్తి తమకు కావాలని పట్టుబట్టారు. సుమారు అరగంట సేపు టోల్‌ప్లాజా వద్ద వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. జోగిపేట సీఐ అనీల్‌కుమార్, ఎస్‌ఐలు క్రాంతి, పాండులు పోలీసు సిబ్బందితో సంఘటన స్థలం వద్దకు చేరుకొని అందరిని చెదరగొట్టారు. టోల్‌ప్లాజా వద్ద ఉన్న సీసీ పుటేజీలను పరిశీలించి భాద్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని జోగిపేట సీఐ అనీల్‌కుమార్‌ తెలిపారు.

Related posts

నేటి నుంచి ‘గ్రూప్‌-4’ వెరిఫికేషన్‌..!!

TNR NEWS

ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి

Harish Hs

*సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యునిగా మట్టి పెళ్లి సైదులు ఎన్నిక…..* 

TNR NEWS

పల్లెల్లో ప్రజలు ఐక్యంగా సంస్కృతి,సాంప్రదాయాలను కాపాడాలి…. డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్…

TNR NEWS

బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్ట్ 

TNR NEWS

ఎమ్మార్పీఎస్ & ఎం.ఎస్.పి. ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 68వ వర్ధంతి 

TNR NEWS