Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలి

కోదాడ: జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 14వ తేదీన నిర్వహించే కోదాడ కోర్టులలో నిర్వహించే లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకొని, ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోదాడ సీనియర్ సివిల్ జడ్జి , మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ కే. సురేష్ కోరారు. దీర్ఘకాలంగా పెండింగ్ వున్న కేసులలో కక్షిదారులు రాజీ పడడం వల్ల వారి సమయం, ధనం ఆదా అవుతాయన్నారు. లోక్ అదాలత్ నిర్వహణ పై శనివారం కోదాడ కోర్టులో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు గట్ల నరసింహారావు అధ్యక్షతన న్యాయమూర్తులు, న్యాయవాదులు, పోలీస్ సిబ్బంది తో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ లోక్ అదాలత్ పై కక్షిదారులకు న్యాయవాదులు, పోలీసులు అవగాహన కల్పించాలని సూచించారు. రాజీ పడతగిన కేసులలో ఇరు వర్గాలు రాజీ పడి తమ కాలాన్ని, ధనాన్ని ఆదా చేసుకోవకడమే కాక, వివాదాలు లేకుండా ప్రశాంతంగా ఉండాలన్నారు. లోక్ అదాలత్ ను విజయవంతం చేసేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కే. భవ్య, సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ చిత్తలూరి సత్యనారాయణ, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చింతకుంట్ల రామిరెడ్డి, ఏపీ పీ లు సిలివేరు వెంకటేశ్వర్లు, కల్యాణి, సీనియర్ న్యాయవాదులు సాధు శరత్ బాబు, తాటి మురళీ, నాళం రాజన్న, మందా వెంకటేశ్వర్లు, కోడూరు వెంకటేశ్వరరావు, హేమలత, కోదండపాణి, దొడ్డ శ్రీధర్, జూనియర్ న్యాయవాదులు శరత్ కుమార్ , ఆవుల మల్లికార్జున్, పెద్దబ్బాయి, ఎస్ ఐ లు రంజిత్ రెడ్డి, అనిల్ రెడ్డి, ఏ ఎస్ ఐ లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

వ్యాసరచన పోటీల్లో తెలంగాణ గురుకుల పాఠశాల విద్యార్థినిల విజయపరంపర

TNR NEWS

రైతులపై మొండి వైఖరి చూపెడుతున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు

Harish Hs

బాల సురక్ష కార్యక్రమం సేఫ్ టచ్, అన్ సేఫ్ టచ్ ఆవేర్నెస్ ప్రోగ్రాం.

Harish Hs

ప్రభుత్వ పాఠశాలలో సంక్రాంతి సంబరాలు

TNR NEWS

దేశాభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్న నిర్మాణ రంగం

TNR NEWS

కోదాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని ఇన్స్పెక్షన్ చేసిన మల్టీ జోన్-II ఐజి సత్యనారాయణ ఐపిఎస్  సరిహద్దుల వెంట అక్రమ రవాణా అరికడతాం  సత్యనారాయణ ఐపీఎస్ ఐజి మల్టీజోన్-II.

TNR NEWS