November 18, 2025
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలి

కోదాడ: జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 14వ తేదీన నిర్వహించే కోదాడ కోర్టులలో నిర్వహించే లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకొని, ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోదాడ సీనియర్ సివిల్ జడ్జి , మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ కే. సురేష్ కోరారు. దీర్ఘకాలంగా పెండింగ్ వున్న కేసులలో కక్షిదారులు రాజీ పడడం వల్ల వారి సమయం, ధనం ఆదా అవుతాయన్నారు. లోక్ అదాలత్ నిర్వహణ పై శనివారం కోదాడ కోర్టులో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు గట్ల నరసింహారావు అధ్యక్షతన న్యాయమూర్తులు, న్యాయవాదులు, పోలీస్ సిబ్బంది తో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ లోక్ అదాలత్ పై కక్షిదారులకు న్యాయవాదులు, పోలీసులు అవగాహన కల్పించాలని సూచించారు. రాజీ పడతగిన కేసులలో ఇరు వర్గాలు రాజీ పడి తమ కాలాన్ని, ధనాన్ని ఆదా చేసుకోవకడమే కాక, వివాదాలు లేకుండా ప్రశాంతంగా ఉండాలన్నారు. లోక్ అదాలత్ ను విజయవంతం చేసేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కే. భవ్య, సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ చిత్తలూరి సత్యనారాయణ, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చింతకుంట్ల రామిరెడ్డి, ఏపీ పీ లు సిలివేరు వెంకటేశ్వర్లు, కల్యాణి, సీనియర్ న్యాయవాదులు సాధు శరత్ బాబు, తాటి మురళీ, నాళం రాజన్న, మందా వెంకటేశ్వర్లు, కోడూరు వెంకటేశ్వరరావు, హేమలత, కోదండపాణి, దొడ్డ శ్రీధర్, జూనియర్ న్యాయవాదులు శరత్ కుమార్ , ఆవుల మల్లికార్జున్, పెద్దబ్బాయి, ఎస్ ఐ లు రంజిత్ రెడ్డి, అనిల్ రెడ్డి, ఏ ఎస్ ఐ లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

పేదలకు అన్నదానం పుణ్యకార్యం

Harish Hs

రైతన్నలకు మరియు ట్రాక్టర్ డ్రైవర్లకు విజ్ఞప్తి

TNR NEWS

పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమం మంచి ఆలోచన

Harish Hs

ప్రజల సమస్యలు వదిలేసి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు…  సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి

TNR NEWS

మునగాల ఎంపీఓ గుండెపోటుతో మృతి

TNR NEWS

విజయవంతంగా విదేశీ పర్యటన  స్వాగతం పలికిన షాద్ నగర్ ఎమ్మెల్యే “వీర్లపల్లి శంకర్”

TNR NEWS