Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

కోదాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని ఇన్స్పెక్షన్ చేసిన మల్టీ జోన్-II ఐజి సత్యనారాయణ ఐపిఎస్  సరిహద్దుల వెంట అక్రమ రవాణా అరికడతాం  సత్యనారాయణ ఐపీఎస్ ఐజి మల్టీజోన్-II.

కోదాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం ఇన్స్పెక్షన్ కు వచ్చిన ఐజి సత్యనారాయణ ఐపీఎస్ జిల్లా అధనపు ఎస్పీ నాగేశ్వరరావు, కోదాడ సబ్ డివిజన్ డిఎస్పి శ్రీధర్ రెడ్డి, రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రజిత రెడ్డి, మునగాల, హుజూర్నగర్ సీఐ లు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు.ముందుగా సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం పరిశీలించి కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. కార్యాలయం నందు నిర్వహిస్తున్న పలు రికార్డ్స్ తనిఖీ చేసి సలహాలు అందించారు.రికార్డ్స్ నిర్వహణలో ఎలాంటి లోపాలు ఉండకుండా చూడాలని ఆదేశించారు. సర్కిల్ పరిధిలో ఉన్న ఐదు పోలీస్ స్టేషన్లకు సంబంధించిన భౌగోళిక మ్యాప్స్, నేరాలకు సంబంధించి హిస్టరీ షీట్స్, నేరాల నమోదు లను పరిశీలించారు, కేసులు పెండింగ్ ఉంచకుండా పని చేయాలని సూచించారు. అనంతరం సబ్ డివిజన్ లో పనిచేస్తున్న సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఎస్సై లతో సమావేశం నిర్వహించడం జరిగింది. కోదాడ సబ్ డివిజన్ ఎక్కువగా ఆంధ్ర సరిహద్దు కలిగి ఉన్నందున సిబ్బంది అందరూ సమాచారం సేకరిస్తూ టీం వర్క్ చేయాలని ఆదేశించారు. ఇక్కడ ఎలాంటి సంఘటన జరిగినా వెంటనే సమాచారం వచ్చేలాగా సమాచార వనరులు బలోపేతం చేసుకోవాలని అన్నారు. అక్రమ రవాణాలను నివారించడం కోసం పటిష్టంగా పనిచేయాలని చెక్ పోస్టుల వద్ద ఆప్రమత్తంగా ఉండాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయం రానున్న సందర్భంగా సరిహద్దు ప్రాంత అధికారులతో సమన్వయంతో పని చేస్తూ అక్రమ రవాణాను నిరోధించాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బుధవారం కోదాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని పరిశీలించడానికి రావడం జరిగింది అని కార్యాలయంలో రికార్డ్స్ నిర్వహణ, పోలీసింగ్ నిర్వహణ సక్రమంగా జరుగుతున్న అని సిబ్బందిని, సీఐ రజిత రెడ్డి ను అభినందిస్తున్నాను అన్నారు. సరిహద్దు ప్రాంతం ఎక్కువగా ఉన్నంది, సన్న ధాన్యానికి తెలంగాణ ప్రభుత్వం బోనస్ చెల్లిస్తున్నందున మన రాష్ట్రం లోకి ఆంధ్రా నుండి వరిదాన్యం రాకుండా కృషి చేస్తున్నాము అన్నారు. ఇతర శాఖల అధికారులతో కలిసి చెక్ పోస్ట్ ల వద్ద అప్రమత్తంగా పని చేస్తూ ఆంధ్రా వైపు నుండి ఇక్కడికి వరి ధాన్యం రాకుండా రైతులకు అండగా పని చేస్తున్నాము అన్నారు.పిడిఎస్ బియ్యం అక్రమ రవాణా జరగకుండా కృషి చేస్తున్నాము, పిడిఎస్ రైస్ అక్రమ రవాణా పై కేసులు నమోదు చేసి బారుగా బియ్యం స్వాధీనం చేసుకున్నాము, తరచుగా పిడిఎస్ బియ్యం అక్రమ దందా కు పాలడుతున్న నర్సింహారావు, జగదీష్ అనే నిందితులపై పిడి యాక్ట్ పెట్టడం జరిగినది అన్నారు. పిడిఎస్ బియ్యం దందా చేస్తున్న వారిని గుర్తించి సూర్యాపేట జిల్లాలో బుధవారం మరో 6 గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నాము అన్నారు. ఆంధ్రా ఒరిస్సా సరిహద్దు నుండి పెద్ద మొత్తంలో వస్తున్న గంజాయి నిరోధించడం, పోలీసు నిఘా బాగా పెరిగి పెద్దమొత్తంలో తరలించే గంజాయి సీజ్ చేస్తున్నందున నేరస్తులు గంజాయిని కొద్ది మొత్తంలో బైక్ లపై తరలిస్తున్నారు ఇలాంటి దాయినిపై మరింత నిఘా ఉంచాం అన్నారు. ఇసుక అక్రమ రవాణా జరగకుండా చర్యలు తీసుకున్నాం అన్నారు. అక్రమ కార్యకలాపాలను, అక్రమ రవాణాను పటిష్టంగా నిర్ములిస్తాం అని ఐజి తెలిపినారు. ఐజి వెంట అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, కోదాడ సబ్ డివిజన్ డిఎస్పి శ్రీధర్ రెడ్డి, రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రజిత రెడ్డి, మునగాల సీఐ రామకృష్ణా రెడ్డి, హుజూర్నగర్ సీఐ చరమంద రాజు, కోదాడ పట్టణ ఇన్స్పెక్టర్ రాము, సబ్ డివిజన్ స్టేషన్ ల ఎస్సై లు, సిబ్బంది ఉన్నారు.

Related posts

బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం పై దాడి హేయమైన చర్య

Harish Hs

మన సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవాలి.  సిపిఎం జిల్లా కార్యదర్శి  వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు

TNR NEWS

నూతన ఉపాధ్యాయుల నుండి డబ్బులు వసూలు చేస్తున్న ఎస్ టి ఓ కొడంగల్ పై చర్యలు తీసుకోవాలి. టీఎస్ యుటిఎఫ్ డిమాండ్.

TNR NEWS

ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కలిసిన వెలమ సంక్షేమ మండలి సభ్యులు

TNR NEWS

బీ ఆర్ ఎస్ వి ఆధ్వర్యంలో గురుకుల బాట. రాష్ట్రంలో గురుకుల పాఠశాలలో సమస్యల పైన. గురుకుల పాఠశాలలో సందర్శించాలని బిఆర్ఎస్వి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 

TNR NEWS

మూడు నాలుక లతో దూడ జననం… బెజ్జుర్లో వింత ఘటన..

TNR NEWS