Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

కామారెడ్డి జిల్లా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సోయా పంటకు మద్దతు ధర కల్పిస్తూ బిచ్కుంద సింగిల్ విండో ఆధ్వర్యంలో నాబార్డు ద్వారా బిచ్కుంద మార్కెట్ యార్డులో కొనుగోలు చేశారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన సోయా వాపసు రావడంపై రైతులు ఆందోళన చేపట్టారు.రైతలు మాట్లాడతూ….తేమశాతం చూశాకే కొన్నారని, ఇప్పుడేమో బాలేవని తిప్పి పంపించడమేమిటని ప్రశ్నించారు. ప్రభుత్వం తీరును నిరసిస్తూ బిచ్కుంద మండల కేంద్రంలో ఆదివారం రైతులు ధర్నాకు దిగారు.బిచ్కుంద మండలం గోపన్ పల్లి రైతులకు చెందిన 3 లోడ్ల లారీల సోయాలో తేమ శాతం సరిపోలేదని తిరిగి వాపసు చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.నిబంధనల ప్రకారమే తాము సోయాలు అమ్మామని కొనుగోళ్ల అనంతరం రైతులకు ఇలా వాపసు చేయడం సరియైన విధానం కాదంటూ విమర్శించారు.వాపసు పంపిన సొయా ను ప్రభుత్వమే పూర్తిగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

Related posts

ఆపదలో ఉన్న మిత్రురాలికి పూర్వ విద్యార్థులు ఆర్థిక సహాయం

TNR NEWS

సావిత్రీబాయి ఫూలే సేవలు మరువలేనివి

TNR NEWS

ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి లో కొత్త రికార్డు సృష్టించిందని జుక్కల్ ఎమ్మెల్యే తోట

TNR NEWS

గ్రామ దేవతలను ఆరాధించడం తెలంగాణ సంస్కృతిలో భాగం

TNR NEWS

కన్న కూతురును నరబలి కొరకు దారుణంగా హత్య చేసిన కేసులో తల్లికి ఉరి శిక్ష విధించిన సూర్యాపేట జిల్లా మొదటి అదనపు సెషన్స్ కోర్టు

TNR NEWS

మెద్వాన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు

TNR NEWS