కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గ కేంద్రంలో భారతదేశ మొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతిని గురువారం కాంగ్రెస్ నాయకులు నిర్వహించారు.నెహ్రూ జయంతి బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని నెహ్రూ చిత్ర పటానికి కాంగ్రెస్ నాయకులు పూల మాలలు వేసి నివాళులర్పించారు.కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి ఓదెలు,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నందగిరి రవి,కాంగ్రెస్ నాయకులు తాళ్లపల్లి సంపత్ గౌడ్,దేవయ్య,వరహాల చారి,మడుపు ప్రేమ్ కుమార్,చలిగంటి ఓదెలు,కనకం కుమార్,తాజ్,కోండ్ర సురేష్,ఆకునూరి మల్లయ్య,కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:
