Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

కామారెడ్డి జిల్లా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సోయా పంటకు మద్దతు ధర కల్పిస్తూ బిచ్కుంద సింగిల్ విండో ఆధ్వర్యంలో నాబార్డు ద్వారా బిచ్కుంద మార్కెట్ యార్డులో కొనుగోలు చేశారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన సోయా వాపసు రావడంపై రైతులు ఆందోళన చేపట్టారు.రైతలు మాట్లాడతూ….తేమశాతం చూశాకే కొన్నారని, ఇప్పుడేమో బాలేవని తిప్పి పంపించడమేమిటని ప్రశ్నించారు. ప్రభుత్వం తీరును నిరసిస్తూ బిచ్కుంద మండల కేంద్రంలో ఆదివారం రైతులు ధర్నాకు దిగారు.బిచ్కుంద మండలం గోపన్ పల్లి రైతులకు చెందిన 3 లోడ్ల లారీల సోయాలో తేమ శాతం సరిపోలేదని తిరిగి వాపసు చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.నిబంధనల ప్రకారమే తాము సోయాలు అమ్మామని కొనుగోళ్ల అనంతరం రైతులకు ఇలా వాపసు చేయడం సరియైన విధానం కాదంటూ విమర్శించారు.వాపసు పంపిన సొయా ను ప్రభుత్వమే పూర్తిగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

Related posts

స్కౌట్స్ & గైడ్స్ కు ప్రత్యేక అభినందనలు……. జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి

TNR NEWS

విద్యార్థులకు సువెన్ కంపెనీ వారి సేవలు అభినందనీయం.. కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి కోట గోపి…

TNR NEWS

పలు గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు

TNR NEWS

చేర్యాల మున్సిఫ్ కోర్టు 29 ప్రారంభానికి చక చకా ఏర్పాట్లు

TNR NEWS

వాహనదారులు సరైన పత్రాలు కలిగివుండాలి 

Harish Hs

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతి

Harish Hs