February 4, 2025
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

శాంతి భద్రతల పరిరక్షణలో సూర్యాపేట జిల్లా పోలీస్ పనితీరు అమోఘం.. ప్రజల భాగస్వామ్యంతోనే నేరాల కట్టడి పోలీసులు పారదర్శకంగా పనిచేయాలి.. ప్రజలకు అందుబాటులో ఉండాలి సూర్యాపేట జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్…

ప్రజల భాగస్వామ్యతోనే నేరాలను అరికట్టవచ్చని, పోలీసులు పారదర్శకంగా పనిచేయాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ చెప్పారు.సోమవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ విలేకరుల సమావేశం నిర్వహించి జిల్లా పోలీసు వార్షిక నివేదికను వెల్లడించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా పోలీసు స్నేహపూర్వక పోలీస్ విధానం అవలంబిస్తూ బాధ్యతాయుతంగా పారదర్శకంగా పనిచేస్తూ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి శాంతి భద్రతల పరిరక్షణలో బాగా కృషి చేస్తున్నాం అని చెప్పారు. ఈ సంవత్సరం బాగా పని చేశామని, పోలీసు నిధుల నిర్వహణలో నేరాల నివారణలో ప్రజలు పౌరుల భాగస్వామ్యమై పోలీసులకు సహకరించారు అని ఎస్పీ తెలిపారు.సూర్యాపేట జిల్లాలో 2023 సంవత్సరంతో పోలిస్తే 2024 సంవత్సరం నందు నేరాలు సమానంగా నమోదైనప్పటికీ కొంతమేర తగ్గుదల ఉన్నదని తెలిపారు. ఈ సంవత్సరం డయల్ 100 కు ఫోన్ కాల్ ద్వారా 34950 ఫిర్యాదులు రాగా సగటున 6 నిమిషాల్లో బాధితులకు పోలీసు సేవలు అందించాం అన్నారు. 2023 నందు 7244 కేసులు నమోదు కాగా 2024 సం.లో 7178 కేసు నమోదైనాయి అన్నారు. వీటిలో భౌతిక దాడులు 796 కేసులు, రోడ్డు ప్రమాదాలు 609 కేసులు, మహిళా సంబంధిత నేరాలు 557 కేసులు, మద్యం అక్రమ రవాణా అక్రమ అమ్మకాలు 434 కేసులు, దొంగతనాలు 536 కేసులు, వంచన మోసాలు 325 కేసులు, సైబర్ నేరాలు 205 కేసులు గా నమోదైనాయి అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త చట్టాలను జూలై నెల నుండి జిల్లాలో అమలు చేస్తున్నామని, ఇప్పటివరకు కొత్త చట్టాల క్రింద 3513 కేసులు నమోదు చేశామని మొదటి కేసును గరిడేపల్లి పోలీస్ స్టేషన్ నందు నమోదు చేయడం జరిగిందని అన్నారు. సైబర్ మోసాలు పెరుగుతున్నాయని, ఈ సంవత్సరం 1212 ఫిర్యాదు లాగా 2005 కేసులు నమోదు చేశామని, సైబర్ మోసాల ద్వారా మోసానికి గురైన 7.83 కోట్ల రూపాయల నుండి సుమారు 40 లక్షల వరకు బాధితులకు రిఫండ్ చేశామని, 1.16 కోట్ల రూపాయలను బ్యాంక్ లలో హోల్డ్ చేయించాం అన్నారు.

ఎన్ఫోర్స్మెంట్ వర్క్ బాగా పెంచడం జరిగిందని, 38 గంజాయి కేసుల్లో 318 కేజీల గంజాయిని సీజ్ చేసి 135 మందిని జైలుకు పంపించామన్నారు. గత సం.తో పోలిస్తే గంజాయి కేసుల్లో ఎక్కువ మందిని అరెస్టు చేశాం అన్నారు. ప్రజా పంపిణీకి చెందిన బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి ఈ సంవత్సరం 178 కేసులు నమోదు చేసి 3200 క్వింటాల బియ్యం సీజ్ చేశామని వెల్లడించారు. బియ్యం అక్రమ రవాణకు సంభందించి 2023 సంవత్సరం తో పోలిస్తే 2024 సం.లో 160శాతం ఎక్కువగా పిడిఎస్ రైస్ కేసులు నమోదు చేసి 193% ఎక్కువగా బియ్యం సీజ్ చేశాం అన్నారు. 289 మందిని రిమాండ్ కు తరలించామని, ఇద్దరిపై పిడి యాక్ట్ నమోదు చేశాం అన్నారు.ఇసుక అక్రమ రవాణాలో 522 కేసులు బుక్ చేసి 650 మందిని అరెస్ట్ చేశామన్నారు. గేమింగ్ యాక్ట్ సంబంధించి 54 కేసులు నమోదు చేసి 313 మందిని అరెస్ట్ చేశామన్నారు. ప్రతిరోజు వాహనాలు తనిఖీలు నిర్వహిస్తూ 236289 ఈ చలాన్ కేసులు నమోదు చేసి 7.53 కోట్ల రూపాయలు జరిమానా విధించడం జరిగినదన్నారు. అలాగే వాహనాలకు నెంబర్ ప్లేట్ లేకపోయినా, డామేజ్ అయిన దానికి సంబంధించి 11321 కేసులు నమోదు చేసి 26 లక్షల 64 వేల రూపాయలు జరిమానా వేయించడం జరిగింది అన్నారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 12,940 మందిపై కేసులను నమోదు చేసి 66 లక్షల 97 వేల రూపాయలు జరిమానా విధించడం జరిగిందని వివరించారు.జిల్లాలో గత సంవత్సరం 122 తీవ్రమైన నేరాలు నమోదు కాగా ఈ సంవత్సరం 36శాతం పెరిగి 167 కేసులు నమోదయ్యాయి అని, ఈ 166 కేసుల్లో కేసుల్లో 151 కేసులు 90 శాతం చేదించి నేరాలకు పాల్పడిన వారిని రిమాండ్ కు తరలించామని తెలిపారు. దొంగతనాలకు సంబంధించి ఈ సంవత్సరం 536 కేసులు నమోదయాయని వీటిలో 63% కేసులు 338 కేసు సేదించి 45శాతం 2 కోట్ల 20 లక్షలు సొమ్ము రికవరీ చేశామన్నారు. వివిధ రూపాల్లో పోగొట్టుకున్నటువంటి మొబైల్స్ సంబంధించి 1780 ఫిర్యాదులు రాగా అందులో 1140 (65 శాతం) మొబైల్స్ రికవరీ చేసి బాధితులకు అందజేయడం జరిగిందని తెలిపారు. నేరాల్లో శిక్షల అమలుకు సంబంధించి ఈ సంవత్సరం 1082 కేసులు వాదనకు రాగా 32 కేసుల్లో 24 మందికి జైలు శిక్షలు అమలు అయ్యాయని, వీటిలో ఆరుగురికి జీవిత ఖైదు, ఇద్దరికీ 15 సంవత్సరాల పైబడి శిక్ష, ఇద్దరికీ 10 సంవత్సరాల పైబడి శిక్ష, ఇద్దరికీ ఐదు సంవత్సరాల పైబడి శిక్ష, ఇద్దరికీ మూడు సంవత్సరాల పైబడి శిక్ష, ఇద్దరికీ ఒక సంవత్సరం పైబడి శిక్ష, మరో ఎనిమిది మందికి సంవత్సరంలోపు శిక్షలు అమలు అయ్యాయని తెలిపారు. కోర్టు మానిటరింగ్ లో సమన్వయంగా బాగా పనిచేస్తున్నామని తెలిపారు. లోక్ అదాలత్ లో 38298 పెట్టీ కేసులను పరిష్కరించామని చెప్పారు.రోడ్డు ప్రమాదాలకు సంబంధించి గత సంవత్సరం 573 కేసుల్లో 257 మంది మరణించగా ఈ సంవత్సరం 609 కేసుల్లో 262 మంది మృత్యువాత పడ్డారని, ఈ మృత్యువాత పడ్డ వారిలో 320 కేసుల్లో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురై 151 మందిమృత్యువాత పడ్డారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని, వీటి నివారణకు ప్రణాళిక పరంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ వివరించారు.మహిళా భద్రతకు సంబంధించి జిల్లాలో స్థానిక పోలీసులతో కలిసి షీ టీమ్స్, భరోసా సెంటర్స్ పనిచేస్తున్నాయని అన్నారు. ఈ సంవత్సరం షీ టీమ్స్ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా 165 అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, 2023 నందు షీ టీమ్స్ కి 141 ఫిర్యాదులు రాగా ఈ సంవత్సరం ఫిర్యాదులు తగ్గి 75 ఫిర్యాదులు వచ్చాయని, 135 ఫ్యామిలీ కౌన్సిలింగ్ కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు. షీ టీం సిబ్బంది ప్రజల్లో తిరుగుతూ 98 పెట్టి కేసులను నమోదు చేశారని తెలిపారు. భరోసా సెంటర్ ద్వారా 132 మందికి కౌన్సిలింగ్ ఇచ్చి 81 కేసుల్లో వైద్య సదుపాయము అందించారు అన్నారు.

ఆపరేషన్ ముస్కాన్ స్మైల్ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఫ్యాక్టరీలు, ఇటుక బట్టీలు, లేబర్ అడ్డాలు, హోటల్స్, లాడ్జిలనుంది షాప్స్ నందు పనిచేస్తున్న 236 మంది బాలురులను, 43 మంది బాలికలను సంరక్షించడం జరిగిందని వెల్లడించారు. మహిళా కేసులకు సంబంధించి గత సంవత్సరం 5503 కేసులు నమోదు కాగా ఈ సంవత్సరం 557 కేసులు నమోదయ్యాయని, వేధింపుల కేసులు, అత్యాచారం కేసులు పెరిగినాయని చెప్పారు. పోలీసు ప్రత్యేక చర్యల వల్ల ఈ సంవత్సరం ఈవ్ టీజింగ్ కేసులు 18 శాతం తగ్గాయన్నారు.

సమాజంలో గొడవలకు, నేరాలకు పాల్పడతారని ముందస్తుగా 344 కేసుల్లో 1888 మంది అనుమానితులను బైండోవర్ చేశామని తెలిపారు.

సామాజిక అంశాలపై ప్రజలను చైతన్య పరుస్తూ గత సంవత్సరం పోలీసు కళాబృందం ఆధ్వర్యంలో 240 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని, 2024 సంవత్సరం నందు 360 అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో అదనపు ఎస్పి మేక నాగేశ్వరరావు, ఏఆర్ అదనపల్లి జనార్దన్ రెడ్డి, సూర్యాపేట డిఎస్పి రవి, నరసింహ, సిఐలు వీర రాఘవులు, రాజశేఖర్, జిల్లా వ్యాప్తంగా ఉన్న సిఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

Related posts

వైద్యవృత్తి ఎంతో పవిత్రమైనది కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ 

TNR NEWS

గ్రంధాలయ సంస్థ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు

Harish Hs

రైతులు నాణ్యమైన ధాన్యం తెచ్చి మద్దతు ధర పొందాలి

Harish Hs

సంక్రాంతి విశిష్టత ఏమిటి.. పెద్ద పండుగ ఎలా అయ్యింది !

Harish Hs

నవంబర్ 23న మాదిగల ఆత్మీయ సమ్మేళన సభ విజయవంతం చేయండి… చింత వినయ్ బాబు జిల్లా కోఆర్డినేటర్,ఎమ్మార్పీఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు

TNR NEWS

శ్రీ గంగా సమేత సంగమేశ్వర స్వామి దీవెనలతో ప్రజలు సుభిక్షంగా ఉండాలి

Harish Hs