Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ప్రజా సంస్కృతిక సంబరాలను జయప్రదం ప్రజానాట్యమండలి జిల్లా ప్రధాన కార్యదర్శి వేల్పుల వెంకన్న

సూర్యాపేట: ఈనెల 23,24 తేదీలలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగే ప్రజానాట్యమండలి ప్రజా సాంస్కృతిక సంబరాలను జయప్రదం చేయాలనిప్రజానాట్యమండలి జిల్లా ప్రధాన కార్యదర్శి వేల్పుల వెంకన్న పిలుపునిచ్చారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రజానాట్యమండలి జిల్లా కార్యాలయంలో జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిపిఎం పార్టీ నాలుగవ రాష్ట్ర మహాసభల సందర్భంగాఈనెల 23 ,24 తేదీలలో సంగారెడ్డిలో జరిగే ప్రజా సంస్కృతిక సంబరాల సందర్భంగా ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో కళారూపాలు ప్రదర్శించడం జరుగుతుందన్నారు. కళాకారులకు గుర్తింపు కార్డు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రదర్శన కోసం వెళుతున్నకళాకారునికి బస్సు సౌకర్యం కల్పించాలని అన్నారు.50 సంవత్సరాలు పైపడ్డ కళాకారులకు నెలకు 5000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇందిరమ్మ ఇండ్లలో కళాకారులకుఅవకాశం కల్పించాలని కోరారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మినీ రవీంద్ర భారతి ఆడిటోరియంనిర్మించాలని డిమాండ్ చేశారు. దీనికోసం రాబోయే కాలంలో పోరాటాలకు ప్రజానాట్యమండి కళాకారులు, జానపద కళాకారులుసిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు బచ్చలకూరి రాంబాబు, ఉపాధ్యక్షులు మామిడి నాగ సైదులు ,పఠాన్ మహబూబలి ,సహాయ కార్యదర్శినందిపాటి సతీష్, జిల్లా కమిటీ సభ్యులు దున్నభిమన్యు ,జనంపల్లి సాయికుమార్ ,కందుకూరి శ్రీకాంత్ పాల్గొన్నారు.

Related posts

ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీన్ లో భాగంగా ప్రతి మహిళకు 2500 ఇవ్వాలి   పాలడుగు ప్రభావతి ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి డిమాండ్

TNR NEWS

సంక్షోభంలో ఉన్న రవాణా రంగాన్ని ఆదుకోవాలి…..  రవాణా రంగ సమస్యలపై పార్లమెంటులో చర్చించాలి….  మాజీ సీఎం, ప్రస్తుత ఎంపీ బిప్లబ్ కుమార్ దేవ్ కు వినతి పత్రం అందజేత..  తెలంగాణ రాష్ట్ర లారీ అసోసియేషన్ చైర్మన్ రామినేని శ్రీనివాసరావు

TNR NEWS

జూలపల్లి లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించిన బిజెపి నాయకులు..

TNR NEWS

వివేకానంద స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి

Harish Hs

టిజిపిఎస్ గ్రూప్-3 పరీక్షలు ప్రశాంతంగా పగడ్బందీగా నిర్వహించాలి.

Harish Hs

బీసీలను మోసం చేసే పార్టీలకు పుట్టగతులుండవు

TNR NEWS